

మన న్యూస్ ,నెల్లూరు రూరల్ ,మే 10:*MSME పార్క్ కు భారత్ సింధూర్ *MSME పార్క్ గా నామకరణం*భారత్ మాతాకి జై.. ఖబర్ధార్ ఖబర్ధార్ పాకిస్థాన్ అంటు నినాదాలు చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆమంచర్ల గ్రామంలో 60 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడనున్న భారత్ సింధూర్ MSME పార్క్”కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో శనివారం ఉదయం శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 60 ఎకరాల్లో MSME పార్క్ పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా ఉంది.. భవిష్యత్లొ మరింత విస్తరిస్తాము అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలొ వందలాది మందికి యువతకు ఉపాధి అవకాశం లభిస్తుంది అని నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.నెల్లూరు రూరల్ అమంచర్ల పార్కు భవిష్యత్ తరాలకు గుర్తుండేందుకు భారత్ సిందూర్ MSME పార్క్ గా పేరు పెట్టాము అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. పాకిస్థాన్ ఉన్మాదులు భారత దేశాన్ని ఉగ్రవాదంతొ బయపెట్టాలని చూస్తే ఇక్కడ బయపడేవాళ్ళు లేరు అని నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు పాకిస్తాన్ భారత దేశంతో అనేక యుద్దాల్లో ఓడినా బుద్ది రాలేదు.. కేవలం మూడు రోజుల్లోనే భారత దేశ పౌరుషాన్ని పాకిస్తాన్ కు చూపించారు భారతీయులు అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. పాకిస్థాన్ పై భారత దేశం పూర్తి స్థాయి యుద్ధం ప్రకటిస్తే ఒక్క రాత్రి లోనే పాకిస్తాన్ ప్రపంచ పటం నుండి తుడిచిపెట్టుకు పోద్ది అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. పాకిస్థాన్ తొ యుద్ధంలో అమరుడైన మురళీ నాయక్ త్యాగాన్ని ఎప్పటికి మరచిపోము అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
