రాష్ట్ర స్థాయి ఓపెన్ అండర్ 13, 15 టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించిన మణికొండ మ్యాచ్ పాయింట్ అకాడమీ క్రీడాకారులు

నాగోల్ మన న్యూస్ ;- తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిజెఆర్ జిహెచ్ఎంసి ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఓపెన్ అండర్ 13, అండర్ 15 టోర్నమెంట్ లో మణికొండ మ్యాచ్ పాయింట్ కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్స్ తమ సత్తా చూపించారు. మే 2 నుండి మే 4 వరకు వరకు జరిగిన ఈ టోర్నమెంట్ లో దాదాపు 400 మందికి పైగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా నాగిరెడ్డి సాహితీ శ్రీ, శౌర్య తేజ్ బొడిగపు జోడి అండర్ 15 మిక్సడ్ డబుల్స్ విభాగంలో గోల్డ్ మెడల్ గెలుపొందారు. వీరు ఫైనల్స్ లో సిద్దార్థ్ సాయి, దివ్య జోడి మీద 15/11,15/09 తో గెలుపొందారు. అలాగే నాగిరెడ్డి సాహితి శ్రీ అండర్ 15 గర్ల్స్ సింగిల్స్ ఫైనల్ లో శృతి చేతిలో 15/13,15/12 తో పోరాడి ఓడిపోయి సిల్వర్ మెడల్ తో సరి పెట్టుకుంది. అలాగే అండర్ 13 బాయ్స్ డబుల్స్ ఫైనల్స్ లో మ్యాచ్ పాయింట్ క్రీడాకారులు జునుగు అభిషేక్, ఆది రుత్విక్ జోడి దీపక్ నాయుడు, చరణ్ తేజ్ ఆకుల జోడి మీద అధ్బుతమైన ఆటతో 15/07,15/13 వరుస సెట్ల లో గెలుపొంది గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు.ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న మూడు ఈవెంట్స్ లో మూడు మెడల్స్ సాధించిన మ్యాచ్ పాయింట్ క్రీడాకారులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయర్ సుమిత్ రెడ్డి మెడల్స్ సాధించిన వారిని శాలువా కప్పి సత్కరించారు. ట్రోఫీస్ తో పాటు సర్టిఫికెట్, క్యాష్ అవార్డ్ కూడా బహుకరించారు. మ్యాచ్ పాయింట్ అధినేత, హెడ్ కోచ్ వేణు ముప్పాల మాట్లాడుతూ మ్యాచ్ పాయింట్ నుండి పాల్గొన్న అందరికి మెడల్స్ రావడం చాలా సంతోషంగా ఉంది అని, దీనికి అంతర్జాతీయ క్రీడాకారులు, కోచ్ జెబిఎస్ విద్యాధర్, బివిఎస్ కె లింగేశ్వర రావు ఇచ్చిన అద్భుతమైన కోచింగ్ వల్లనే సాధ్యం అయిందని తెలిపారు. ప్రొఫెషనల్ గా బ్యాడ్మింటన్ నేర్చుకోవాలంటే మ్యాచ్ పాయింట్ కి రావాలని పిలుపునిచ్చారు.

Related Posts

సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు

మన న్యూస్,ఎస్ఆర్ పురం:-సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు విజేతగా నిలిచి 40 వేల రూపాయలు గెలుపు పొందడం జరిగింది. ఎస్ఆర్ పురం మండలం u.m. పురం గ్రామంలో నిర్వహించిన సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్లో యు.ఎం. పురం క్రికెట్…

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు పాకల విద్యార్థినిలు

మన న్యూస్ సింగరాయకొండ:-ప్రకాశం జిల్లా మహిళల బీచ్ కబడ్డీ జట్టుకు ఐదుగురు పాకల క్రీడాకారిణులు ఎంపికైనట్లు కోచ్ పిల్లి హజరత్తయ్య తెలిపారు.1)వి.అర్చన 2)కె.భూమిక3) కె.సౌమ్య 4) కె. సి పోరా 5)కె. త్రిగుణ ఎంపికైనట్లు తెలిపారు.వీరు12 వ ఆంధ్ర రాష్ట్ర అంతర…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

  • By JALAIAH
  • September 10, 2025
  • 2 views
సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

  • By JALAIAH
  • September 10, 2025
  • 3 views
పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

  • By JALAIAH
  • September 10, 2025
  • 3 views
మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

  • By JALAIAH
  • September 10, 2025
  • 4 views
రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

  • By RAHEEM
  • September 10, 2025
  • 8 views
నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

  • By JALAIAH
  • September 10, 2025
  • 9 views
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ