గిరిజనులు సాగు చేస్తున్న భూములకు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేయాలి

మనను సాలూరు మే 5: పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో గిరిజను లు సాగు చేస్తున్న భూములకు పట్టాల మంజూరు చేయాలని ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో పాచిపెంట మండల కేంద్రంలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద ర్యాలీ గా వెళ్లి నిరసన కార్యక్రమం జరిగింది, సాగు చేస్తున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని అన్యాక్రాంతమైన భూములు గిరిజనులకు అప్పజెప్పాలని కోరుతూ తాసిల్దార్ రవికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది, ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం నాయకులు మజ్జి కృష్ణమూర్తి జి అనంత్ ఆదరిలో జరిగిన కార్యక్రమాలు సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన భూములకు రక్షణ కల్పించాలని వెంటనే పట్టాల మంజూరు చేయాలని పట్టాలు ఇవ్వకపోవడం వలన మా రాయి గుడ్డి వలస తాడూరు పంచాయతీలో ఉన్నటువంటి భూములు లో ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందడం లేదని బ్యాంకు రుణాలు అందటం లేదని ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు తెచ్చుకుని వ్యవసాయం చేసి నష్టపోతున్న పరిస్థితి ఏర్పడుతుందని, అలాగే ఈ భూములకు పట్టాలు కూడా మంజూరు చేయలేదని అన్నారు. అలాగే సరే వలస రెవెన్యూలో మేము సాగు చేస్తున్న భూములకు పెద్ద గడ్డ జలాశయంలో ఉన్న మడవలస తురిపాడు గ్రామ గిరిజనులకు పట్టాలు ప్రభుత్వం అందించడం వలన గిరిజనులకు, తగువులు పెట్టే పరిస్థితి ఏర్పడిందని. ఆ గిరిజనులకు భూములు ఇవ్వాలి, మా భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్వేలు చేయకుండా మా భూముల్లో పట్టాలి ఇవ్వకపోవడం వలన గిరిజనులు గొడవలు పడుతున్న పరిస్థితి ఏర్పడిందని ఇది పరిష్కారం చేయాలంటే మా భూములకు పట్టాలి ఇవ్వాలి, గిరిజనుల పోరాటానికి మద్దతునిస్తూ సిపిఎం జిల్లా నాయకులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ గిరిజనులు తాతల కాలం నుండి సాగు చేస్తున్న భూములకు నేటికీ పట్టాలు సక్రమంగా అందించకపోవడం వలన ఈ భూములు అన్యాక్రాంతమవుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై రెవెన్యూ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు గత నెలలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేయడం జరిగిందని కలెక్టర్ ఆదేశాలను మండల స్థాయి అధికారులు పాటించి పేదలకు న్యాయం చేయాలని, సాగు పట్టాలు ఇవ్వాలని అన్యాక్రాంతం చేసినటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తాసిల్దార్ రవి మాట్లాడుతూ సాగు పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నం సీరియస్గా చేస్తామని, దీనిపైన ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని మేము తప్పనిసరిగా ఆ పంచాయతీలో ఉన్నటువంటి ప్రాంతాలు పర్యటించి పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. పాచిపెంట మండలం తాసిల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నాయకులు గిరిజనులు పాల్గొన్నారు.

Related Posts

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా