కనిగిరి రిజర్వాయర్ నుంచి రెండో పంటకు నీటి విడుదల……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్ ,కోవూరు, మే 4:సాగునీటి సంఘ అధ్యక్షులు మరియు ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో ఆయకట్టు పరిధిలోని చివరి ఎకరాకు సాగునీరు అందించేందుకు కృషి చేయాలి.నీటి వృధాని అరికట్టి నీళ్లు పొదుపుగా వినియోగించండి.పంటలు బాగా పండి రైతులు సుభిక్షంగా వుండాలి.నీటి విడుదల సందర్భముగా వరుణుడు కరుణించి వర్షం పడడం శుభసూచకం-ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో రైతులు సుభిక్షంగా వున్నారన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . ప్రస్తుత ఖరీఫ్ సీజన్ సందర్భంగా కోవూరు నియోజకవర్గ రైతాంగ నారుమళ్ల అవసరాల కోసం ఆమె కనిగిరి రిజర్వాయర్ క్రస్ట్ గేట్లుఎత్తి ఈస్ట్రన్ ఛానల్ మరియు సదరన్ ఛానల్స్ కు నీళ్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ…….. కనిగిరి రిజర్వాయర్ నుంచి నీటి విడుదల సందర్భముగా వరుణుడు కరుణించి వర్షం పడడం శుభ సూచకమన్నారు. గత సంవత్సరం కోవూరు నియోజకవర్గ రైతులు అధిక దిగుబడులు సాధించడం సంతోషంగా వుందన్నారు.గిట్టుబాటు ధరతో పాటు గతమెన్నడూ లేని విధంగా ధాన్యం అమ్మిన 24 గంటలలోనే హమాలీ చార్జీలతో సహా రైతుల ఖాతాలలో జమ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఆమె ధన్యవాదాలు తెలియచేసారు.
తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన 11 నెలల వ్యవధిలో కనిగిరి రిజర్వాయర్ నుంచి రెండు సార్లు నీళ్లు విడుదల చేయడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. కనిగిరి రిజర్వాయర్ లో ప్రస్తుతం 2. 7 TMC ల నీళ్లు వున్నాయని రెండో పంటకు ఎటువంటి యిబ్బంది రాదన్నారు. ఇరిగేషన్ అధికారులు, సాగునీటి సంఘ అధ్యక్షులు పరస్పర సమన్వయంతో చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు కృషి చేయలన్నారు. నీటి వృధాని అరికట్టి నీళ్లు పొదుపుగా వాడుకోవాలని రైతులకు సూచించారు. దేవుడు అనుగ్రహంతో పంటలు బాగా పండి కోవూరు నియోజకవర్గ రైతులు సుభిక్షంగా వుండాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెన్నాడెల్టా ఛైర్మెన్ జెట్టి రాజగోపాలరెడ్డి, ఇరిగేషన్ ఎ ఇ మరియు డి ఇ లు ఎన్ వెంకట ప్రసాద్, వై పెంచలయ్య, బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, కౌన్సిలర్లు పుట్టా లక్ష్మీకాంతమ్మ, లలితమ్మతాళ్ల వైష్ణవి, చీర్ల ప్రసాద్, పలువురు నీటి సంఘ అధ్యక్షులు డైరెక్టర్లతో పాటు టిడిపి నాయకులు బత్తల హరికృష్ణ, ఎంవి శేషయ్య, శివయ్య నాయుడు, యర్రంరెడ్డి గోవర్ధనరెడ్డి, చెముకుల కృష్ణ చైతన్య, సూరా శ్రీనివాసులు రెడ్డి ఏటూరి శివరామక్రిష్ణా రెడ్డి, మోర్ల మురళి,పటేల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు