నెల్లూరు ,వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందజేసిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు, మే 2:– షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి సర్వం కోల్పోయిన నెల్లూరు కోటమిట్ట 42 డివిజన్ కు చెందిన సర్తాజ్ కుటుంబానికి వైఎస్ఆర్సిపి మైనార్టీ నాయకులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం నెల్లూరు రాంజీ నగర్ ఆఫీస్ లో బాధిత కుటుంబానికి నగదును అందజేశారు.బాధిత కుటుంబానికి మరి కొంత నగదును అందజేసేందుకు ముందుకు వచ్చిన 42 వ డివిజన్ కార్పొరేటర్ కరిముల్లాని కూడా చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు.సర్తజ్ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. నెల్లూరు సిటీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజుసర్తాజ్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయడం జరిగిందన్నారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన సర్తజ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రశేఖర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్, వైసిపి జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ సిద్దిక్,42వ డివిజన్ కార్పొరేటర్ కరిముల్లా, 42 వ డివిజన్ నాయకులు అబ్దుల్ మస్తాన్, అలీం, జహీద్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 4 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి