

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో సోయా కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించారు. అంతకుముందు ఎమ్మెల్యే కాంటాకు పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి కటపై సొయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం సోయా పంటకు క్వింటాలుకు రూ.4,892/- మద్దతు ధర ప్రకటించిందని అన్నరు. సమీప రైతులు అందరూ సోయా బీన్ పంటను పెద్ద కొడప్గల్ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి విక్రయించాలని కోరారు. ఇంతకుముందు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఎకరానికి ఆరు క్వింటాళ్లు మాత్రమే సేకరణ జరిగేదని తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కలిసి దీనిపై మాట్లాడటం జరిగిందని అన్నారు. సోయా రైతుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడం వల్ల ఎకరానికి పది క్వింటాళ్లు సేకరించాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.
రైతులు అందరూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే తమ పంటను విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దు అని సూచించారు. కొనుగోలు కేంద్రంలో సీరియల్ ప్రకారం కొనుగోలు చేయడం జరుగుతుందని రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు హన్మంత్ రెడ్డి ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి ,నాయకులు మల్లప్ప పటేల్,చిప్ప మోహన్,శ్యామప్ప,నాగి రెడ్డి, మోగులగౌడ్,అహ్మద్,డాక్టర్ సంజీవ్, పండరి,మొహిద్దిన్, సంతోష్,బస్వరాజ్ దేశాయ్, హన్మాండ్లు,చాంద్ పాషా ,ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు