ప్రతి కార్మికుడికి మెరుగైన జీవనం స్థిరమైన ఆదాయం భద్రత కల్పించడమే టిడిపి లక్ష్యం…రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్

మన న్యూస్,తిరుపతి:- రాష్ట్రంలోని ప్రతి కార్మికుడికి మెరుగైన జీవనంతో పాటు స్థిరమైన ఆదాయం భద్రత కల్పించడమే తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తెలిపారు. రేణిగుంట రోడ్డు లోని టిడిపి పార్లమెంటు కార్యాలయం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎన్టియుసి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల దినోత్సవం తెలుగుదేశం పార్టీ గౌరవిస్తుందని, కూలీల కార్మికుల సంక్షేమానికి నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారన్నారు. టిడిపి పాలనలో కార్మికుల సంక్షేమం కోసం శ్రామిక భీమా పథకం, కౌలు కార్మికులకు వృత్తి నైపుణ్యాభివృద్ధి శిక్షణ, వృత్తి ఆధారిత ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పారు. కార్మికులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందని చెప్పారు. నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ కార్యక్రమాలు, కార్మికులకు ఆధునిక వృత్తి నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి దంపూరి భాస్కర్ యాదవ్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, టిడిపి నగర ప్రధాన కార్యదర్శి నైనారు మహేష్ యాదవ్, టిడిపి తిరుపతి పార్లమెంట్ కార్యదర్శి యశ్వంత్ రెడ్డి రవిశంకర్ యాదవ్, చెంబకూరు రాజయ్య, లోకేష్ రెడ్డి అప్ప నాయుడు సుబ్బారావు, సిరి వేలు భారతి, గంధం బాబు, రామారావు పలువురు కార్మికులు పాల్గొన్నారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///