వరంగల్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు

రాష్ట్రాన్ని సాధించిన పార్టీ, తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పాలనలో సకలజనులు సంతోషంగా ఉన్నారు.బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు పార్టీ జెండాను ఎగురవేసిన

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా జిల్లా గద్వాల జిల్లా నియోజకవర్గం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ,అలంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే విజయుడు భారీ సంఖ్యలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన పార్టీ, సకలజనులకు సంపూర్ణ సంక్షేమాన్ని అందించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఎమ్మెల్యేలు అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను పురస్కరించుకొని పార్టీ కార్యాలయ ఆవరణలో గులాబీ జెండాను ఎగరవేసిన అనంతరం మాట్లాడారు. తెలంగాణ ప్రజల చిరకాల వంచను నెరవేర్చి, ప్రత్యేక రాష్ట్రాలు సాధించిన ఘనత విఆర్ఎస్ పార్టీకి దక్కిందని ఎమ్మెల్యేలు అన్నారు. స్వరాష్ట్రంలో కెసిఆర్ పాలనలో అభివృద్ధిలోనే రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపామని అన్నారు. కెసిఆర్ పాలన తీరు దేశానికి ఆదర్శంగా నిలిచిందని, సకలజనులకు సంక్షేమ అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, బీసీ బందు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కెసిఆర్ కిట్లు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు పేద ప్రజల అభివృద్ధికి దోహదపడ్డాయని అభిప్రాయపడ్డారు. కెసిఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. టిఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ అని, ఎప్పటికైనా తెలంగాణ ప్రజల బాగోగులను చూచే ఏకైక పార్టీ గులాబీ పార్టీ అని అన్నారు. తెలంగాణ ప్రజల పార్టీ రజతోత్సవ వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని, రజతోత్సవాన్ని తెలంగాణ ప్రజలు పండుగల భావిస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే వరంగల్లో నిర్వహిస్తున్న రజోత్సవ వేడుకలకు నియోజకవర్గం నుంచి వేలాది మంది కార్యకర్తలు తరలి వెళ్లారు. సభకు వెళ్తున్న వాహనాలకు ఎమ్మెల్యేలు జెండాను ఊపి స్వాగతం పలికారు. ప్రతి పల్లె నుంచి గులాబీ దండు వరంగల్ సభకు తరలివచ్చారని ఈ సందర్భంగా పలువురు నాయకులు చెప్పారు.ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 2 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు