వక్ఫ్ సవరణ చట్టం పై అవగాహన వీధి సమావేశం

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్):
భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారి సూచనలు మేరకు వక్ఫ్ సవరణ చట్టం ప్రజా అవగాహన కరపత్రాలు పంపిణీ చేసి,స్థానిక ముస్లిం సోదరుల వీధిలో ముస్లిం పెద్దలు,మహిళలతో వీధి సమావేశం నిర్వహించి ,వక్ఫ్ సవరణ చట్టం 2025 లో అంశాలు,ప్రయోజనాలు గురించి వివరించడం జరిగింది.ఈ సందర్భంగా వక్ఫ్ సవరణ చట్టం ప్రజా అవగాహన ప్రోగ్రామ్ జిల్లా కో కన్వీనర్ కొల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ
దశాబ్దాలుగా పేద బడుగు బలహీనవర్గ ముస్లింలు, ముస్లిం మహిళలు, ముస్లిం యువతకి జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయడానికే వక్ఫ్ చట్టం 2025 ప్రధాని మోడీ తీసుకురావటం జరిగిందని, వక్ఫ్ ఆస్తుల ద్వారా వచ్చే సంపదని పేద ముస్లింల యొక్క వైద్యానికి, విద్యకి, ముస్లిం వితంతువులు యొక్క పోషణకి ,ముస్లిం యువతకి ఉపాధి కలిగే విధంగా చట్టాన్ని రూపొందించారని శ్రీనివాస్ అన్నారు.కన్వీనర్ సింగిలీదేవి సత్తిరాజు మాట్లాడుతూ దశాబ్దాలుగా వాళ్లకి అన్యాయం చేసి కొంతమంది దాన్ని వారి స్వప్రయోజనాలకి వాడుకున్నారని ఈ దోపిడీనీ ఈ చట్టం అరికడుతుందని, నిరుపేద ముస్లింలను ఆదుకుంటుందని అన్నారు. కేంద్ర ,రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో ఇకపై తప్పనిసరిగా ఇద్దరు ముస్లిం మహిళలకు చోటు దక్కుతుందని ,వక్ఫ్ చట్టం 2025 పై అన్ని వర్గాల ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన కలిగించి ,అపోహలు తొలగిస్తామని మండల పూర్వ అధ్యక్షులు కంద వీరాస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో దేవర రామకృష్ణ, నక్క శ్రీను,తేజోమూర్తుల ఉషారాణి, సిద్ధపరెడ్డి చంద్రరావు,ముస్లిం సోదరులు,మహిళలు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..