విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు

మన న్యూస్,నెల్లూరు, ఏప్రిల్ 24 :– ఉన్నత చదువులు చదివిస్తామని వెల్లడి. 100 శాతం ఉత్తీర్ణత సాధించడం సంతోషంగా ఉంది. విపిఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నడుస్తున్న కనుపర్తిపాడులోని విపిఆర్‌ విద్య పాఠశాలలో పదో తరగతి ఫలితాల్లో 587 మార్కులు సాధించిన విద్యార్థిని గాయత్రిని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. గురువారం నెల్లూరులోని విపిఆర్‌ నివాసానికి వచ్చిన విద్యార్థిని.. ఈ సందర్భంగా ప్రశాంతమ్మను కలిశారు. అత్యుత్తమ ఫలితాలు సాధించినందుకు విద్యార్థినిని ఎమ్మెల్యే అభినందించారు. విద్యార్థిని ఉన్నత చదువులకు అయ్యే ఖర్చును తాము భరిస్తామని, ఇంజినీరింగ్‌ చదవాలన్న విద్యార్థిని కోరికను నిజం చేస్తామన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ..ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆలోచనలకు నిదర్శనమైన విపిఆర్‌ విద్య పాఠశాలలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సంవత్సరం 29 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే.. 100 శాతం ఉత్తీర్ణత సాధించామన్నారు. దీనికి పాఠశాల సిబ్బంది ఎంతో కష్టపడ్డారని కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్‌ వి.టి శ్రీనివాస్‌, విద్యార్థిని తల్లి ఝాన్సి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ.. వేమిరెడ్డి దంపతుల సహకారంతో తన కూతురు మంచి ఫలితాలు సాధించిందని, వారికి తాము జీవితాంతం రుణపడి ఉంటామన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..