పహల్గామ్ ఉగ్రదాడికి ఇస్లామిక్ మతోన్మాదమే కారణం.

Mana News :- మ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని మానవపాడు బస్టాండ్ మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర BJYM మండల అధ్యక్షుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా BJYM రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్ శర్మ మాట్లాడుతూ. నిన్న జమ్మూ కాశ్మీర్ లో టూరిస్ట్ ల మీద ఉగ్రవాదులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం, ఇది భారతదేశ ఐక్యత, సమగ్రతపై దాడి, కేవలం హిందువులే లక్ష్యంగా జరిపిన ఈ ఉగ్రవాద చర్యను అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు తమ తమ విభేదాలను పక్కనపెట్టి ఖండించాలి, బాధితులు అండగా నిలవాలని, ఈ దాడికి కారకులైన వారిని త్వరగా కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని, వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించే వారిని, ఉగ్రవాద సంస్థల సానుభూతిపరులను అణచివేయాలని కోరారు.దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నని రోజులు దేశంతోపాటు కాశ్మీర్ సురక్షితంగా ఉందనీ కానీ జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొంతకాలంలోనే ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయని ఇస్లామిక్ చాందస ఉన్మాదుల వలన పదుల సంఖ్యలో హిందువుల ఊచకోత ఘటన జరగడం ఉగ్రవాదుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వాల అసమర్థ, ఉదాసీనత ధోరణి వల్లె జరిగిందని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా ఉగ్రవాదులను సమూలంగా నిర్మూలించడం కోసం బీజేపీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, దానికి అందరూ సహకరించాలని, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో BJP మండల అధ్యక్షుడు మురళీకృష్ణ , ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రాజు, కిసాన్ మోర్చా అధ్యక్షుడు తిమ్మప్ప, రాఘవయ్య, రాకేష్, లక్ష్మీనారాయణ, వెంకీ, మధు, నాగరాజు,పరశురాముడు, బాలు, శ్రీనివాసులు, వెంకటేష్, బాబు, లోకేష్ ఉషన్ యాదవ్ నరసింహ
బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

తవణంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం – వృద్ధురాలు మృతి

మన ధ్యాస తవణంపల్లె ఆగస్ట్-30:చిత్తూరు–అరగొండ రహదారిపై తవణంపల్లి గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం ఒక కుటుంబంలో విషాదాన్ని నింపింది. గంగవరం మండలం కీళపట్ల గ్రామానికి చెందిన టి. మునీంద్ర తన నాన్నమ్మ టి. నారాయణమ్మ (వయసు 74, భర్త…

ఏసీబీ వలలో కల్యాణదుర్గం సబ్ రిజిస్టార్ నారాయణస్వామి – లంచం తీసుకుంటూ పట్టుబాటు

అనంతపురం జిల్లా మన న్యూస్:- కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి చీకటి ఛాయలు తెరుచుకున్నాయి. కొంతకాలంగా సబ్ రిజిస్ట్రార్ ఇన్‌చార్జ్‌గా విధులు నిర్వహిస్తున్న నారాయణస్వామిపై ఫిర్యాదులు రావడంతో, అతనిపై ఎప్పటినుంచో కన్నేసిన ఏసీబీ అధికారులు చివరికి ట్రాప్ వేసి పట్టుకున్నారు.పక్కా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

  • By JALAIAH
  • September 10, 2025
  • 2 views
సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

  • By JALAIAH
  • September 10, 2025
  • 3 views
పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

  • By JALAIAH
  • September 10, 2025
  • 3 views
మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

  • By JALAIAH
  • September 10, 2025
  • 4 views
రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

  • By RAHEEM
  • September 10, 2025
  • 8 views
నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

  • By JALAIAH
  • September 10, 2025
  • 9 views
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ