

మాన న్యూస్, నారాయణ పేట: సోమవారం రోజు కోస్గి పోలీస్ స్టేషన్ పరిధిలో నార్కోటిక్స్ స్నైపర్ పోలీసు జాగిలంతో పలు ప్రదేశాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని డిఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు. గంజాయి మత్తు పదార్థాల నిర్మూలన గురించి, అక్రమ రవాణా జరగకుండా కోస్గి పోలీస్ స్టేషన్ పరిధిలో పకడ్బందీగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా కిరాణా షాపులలో, అనుమానంగా ఉన్న పంట పొలాల్లో, పన్ షాప్ లలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రజలు, ఎవరైనా గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు వినియోగిస్తున్న లేదా రవాణా చేసిన, సరఫరా చేసిన వెంటనే డయల్ 100 కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుతుందని డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ ఆంజనేయులు, నార్కోటిక్స్ స్నైపర్ డాగ్ విక్కి, డాగ్ హ్యాండ్లర్ పరమేష్ పాల్గొన్నారు.
