పిఠాపురంలో దళితులు సాంఘిక బహిష్కరణ..

  • వ్యవసాయ పనులకు పిలవరాదు..
  • టిఫిన్లు, పాలు ఇవ్వరాదు..
  • పెత్తందార్లు నిర్ణయం విచారణ చేపట్టిన ఆర్డీవో, పోలీసులు…

మన న్యూస్ పిఠాపురం (అపురూప్): పిఠాపురం మండలం మల్లం గ్రామంలో దళితులు సాంఘిక బహిష్కరణకు గురయ్యారు. దళితులను వ్యవసాయ, వ్యవసాయేతర పనులకు పిలవరాదని, హోటల్స్ లో టిఫిన్, టీ, పాలు, కిరాణా ఇవ్వరాదని గ్రామంలో కొందరు పెత్తందార్లు నిర్ణయించారు. అలాగే దళితులు అగ్రవర్ణాల నివసించే చోట చేపలు విక్రయించడం తదితర పనులు నిలిపివేశారు. కోడి మాంసం అమ్మె ఎస్టీ కులానికి చెందిన వారిని కూడా ఎస్సి కులస్తులకు కోడి మాంసం విక్రయించరాదని ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య వచ్చి 78 సంవత్సరాలయినా తమపై ఇంకా వివక్షత కొనసాగడంపై గ్రామానికి చెందిన పలువురు దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఈ ఘటన జరగడంతో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.పిఠాపురం మండలంలోని మల్లంలో వెలిశెట్టి జల్లిబాబు ఇంటికి ఈ నెల 16 న గ్రామానికి చెందిన దళితుడు పల్లపు సురేష్ (37) కరెంటు పనిచేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు.అతనికి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీనిపై 17న గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సురేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ దళితులంతా ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ ఇరు వర్గాల సమక్షంలో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించారు. ఈ నేపథ్యంలో దళితులు ఐక్యంగా ఉండడం, వారి హక్కుల కోసం నిలబడటం అగ్రవర్ణాలకు కంటగింపుగా మారింది. దళితులను ఇలాగే వదిలేస్తే వాళ్లు మరింత రెచ్చిపోతారని గత రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన కొందరు పెత్తందార్లు సమావేశం పెట్టుకుని పెత్తందారులు తలుచుకుంటే ఏవిధంగా ఉంటుందో దళితులకు తెలియజేయాలని సాంఘిక బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు.కొందరు పెద్దలు చేసిన నిర్ణయం మేరకు తమను పనిలోకి పిలవడం లేదని, అలాగే పాలు పోసే వ్యక్తులు, హోటల్స్ నిర్వాహకులు కూడా పాలు టిఫిన్ ఇచ్చేది లేదని ఈ సందర్భంగా దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్రవర్ణాల నివసించే ప్రాంతంలో చేపలు అమ్మకం వగైరా నిలిపివేయాలని హుకుం జారీ చేశారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 2 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు