ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో చంద్రన్నకు ఆకాశమంత అభిమానాన్ని చాటిన ప్రజానికం.75 ఏళ్ల నవ యువ నాయకుడు చంద్రన్నకు ఘనంగా 75వ జన్మదిన వేడుకలు..!

ఉదయగిరి మన న్యూస్:మండేటెండను సైతం లెక్కచేయక 75 అభివృద్ధి పనులను ప్రారంభించి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..

ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో వాడవాడల నవనిర్మాణ దీక్ష దక్షుడు అమరావతి రూపశిల్పి పట్టిసీమ పోలవరం నిర్మాణ కృషివలుడు నేటి దేశ రాజకీయంలో పరిణితి చెందిన రాజనీతిజ్ఞుడు యువతకు స్ఫూర్తి ప్రదాత ప్రజా శ్రేయస్సు అతని ధ్యేయం కాలంతో పోటీ పడే తెలుగు చంద్రుడు, సవాళ్లను స్వీకరిస్తూ సంక్షోభంలోనూ అద్భుతాలు సృష్టించగల సైనికులు అలుపెరగని పోరాటయోధుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
75 ఏళ్ల నవ యువ నాయకుడు చంద్రన్న పుట్టినరోజును పురస్కరించుకొని వింజమూరు ప్రధాన పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. యువత పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేసి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని 8 మండలాలలో మండల నాయకుల ఆధ్వర్యంలో చంద్రన్న పుట్టినరోజు వేడుకలను నాయకులు కార్యకర్తలు అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ జలదంకి,కలిగిరి, వింజమూరు ,ఉదయగిరి, మండలాల్లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజులు పురస్కరించుకొని నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేసుకున్న 75 అభివృద్ధి కార్యక్రమాలను మండుటెండను సైతం లెక్కచేయక ఎంతో ఓర్పు నేర్పుతో ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ప్రారంభించారు.
ముఖ్యంగా సిసి రోడ్లు, అంగన్వాడీ భవనాలు, నూతన భవనాలు, గోకులం షెడ్లును ప్రారంభించారు. నాయకులు అభిమానులు చంద్రన్న పై ఆకాశమంత అభిమానాన్ని చాటుతూ పోటీపడి మరి పెద్ద ఎత్తున పుట్టినరోజు సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ చేపట్టిన కార్యక్రమాలలో వేలాదిగా టిడిపి నాయకులు కార్యకర్తలు హాజరై పండుగ వాతావరణం లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అపారమైన అనుభవం సమర్థవంతమైన పాలనతో రాష్ట్రానికి మంచి భవిష్యత్తు అందించే ఏకైక నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్లో పాల్గొని చంద్రన్నకు శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు అందించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి వెంట మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి మాజీ జడ్పీ చైర్మన్ పొన్నుబోయిన చంచల బాబు యాదవ్ ఎనిమిది మండలాల మండల కన్వీనర్లు మండల నాయకులు కూటమి నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

  • Related Posts

    మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు

    ఎన్‌హెచ్‌-16పై బరి తెగించిన ఆయిల్‌ మాఫియా మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్) 16వ నెంబరు జాతీయ రహదారిపై ఆయిల్‌ ముఠా దుకాణాలు.ఎర్రవరం మొదలుకుని తుని రూరల్‌ వరకు హైవేపై పదుల సంఖ్యలో ఆయిల్‌ ముఠాలున్నాయి. వీరంతా కలిపి 26…

    ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

    మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్) :- జమ్మూ కాశ్మీర్ లోని పహాల్ గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు

    మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు

    ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

    ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

    జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి

    • By JALAIAH
    • April 24, 2025
    • 3 views
    జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి

    మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు,ఎన్‌హెచ్‌-16పై బరి తెగించిన ఆయిల్‌ మాఫియా,అవాక్కై ఆరా తీస్తే గుట్టు రట్టయిన వ్యాపారం -ప్రత్తిపాడు నుంచి తుని వరకు దుకాణాలన్నింటినీ తొలగించిన ఖాకీలు

    మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు,ఎన్‌హెచ్‌-16పై బరి తెగించిన ఆయిల్‌ మాఫియా,అవాక్కై ఆరా తీస్తే గుట్టు రట్టయిన వ్యాపారం -ప్రత్తిపాడు నుంచి తుని వరకు దుకాణాలన్నింటినీ తొలగించిన ఖాకీలు

    భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

    భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి