త్రాగునీటికి ఇబ్బంది పడుతున్న కుమ్మరవలస గిరిజన ప్రజలు, పట్టించుకోలేని సంబంధిత అధికారులు

పాచిపెంట నవంబర్16( మన న్యూస్ ):=

పార్వతిపురం మంజం జిల్లా పాచిపెంట మండలంలో రెండు నెలలకు పైగా త్రాగునీటి సమస్య పరిష్కారం చేయకపోవడం వలన గెడ్డ ఊట చలమనీరు కలుషితనీరు త్రాగి రోగాలు మారిన పడుతున్న కుమ్మరివలస గిరిజనులు త్రాగునీటి సమస్య మీద అధికారులకు విన్నవించుకున్న మొరపెట్టుకున్న పట్టించుకోలేదని సంబంధిత అధికారులు ఆవేదన చెందిన గిరిజనులు, పాచిపెంట మండలం కేసలి పంచాయితీ నిర్వాసిత గిరిజన గ్రామమైన కుమ్మరవలస గ్రామానికి గిరిజనులకు రెండు నెలలకు పైగా మోటారు పాడైపోయిందని అప్పటినుంచి ఎంపీడీవో కి ఇతర ఉన్నతాధికారులకు తెలియజేసిన వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోలేదని,స్థానిక సిపిఎం నాయకులు అప్పటినుంచి ఎంపీడీవో కి ఇతర ఉన్నతాధికారులకు తెలియజేసిన వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోలేదని స్థానిక సిపిఎం నాయకులు దిసరి వసంతరావు స్థానిక మహిళలు కోడికాల బీమాలు నారాయణమ్మ బుచ్చమ్మ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ. గత నెల గ్రామం మొత్తం గిరిజనులందరూ జ్వరాలు బారిన పడ్డారని పాచిపెంట ఆరోగ్య కేంద్రం నుంచి వైద్యాధికారులు రక్తపరీక్షలు నిర్వహించి వైద్యం అందించారని ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు స్పందించి త్రాగునీటి సమస్య పరిష్కారం చేయడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రెండు నెలల క్రిందట ఎండిఓకి వాటర్ సమస్య వలన బోరు బాగు చేయండి మోటార్ బాగు చేయండి అని వినతిపత్రం ఇస్తే నేటికీ కూడా ఆ గ్రామానికి వెళ్లకుండా ఆ గ్రామ గిరిజనులు పట్టించుకోకుండా వ్యవహరించడం నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆ గ్రామంలో బోరు ఒకటి తీయాలని అలాగే పాడైపోయిన మోటార్ను బాగు చేసి ట్యాంకు ద్వారా నీరు అందించి గిరిజనులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కిలో మీటర్ పైగా గెడ్డ వాగు నుంచి పెద్ద పెద్ద ఒడ్డులు ఎక్కి త్రాగునీటి కోసం కలుషితమైన చలం గెడ్డ ఊట నీరు త్రాగి అనారోగ్యాలు ఫాలోతున్నారని, సంబంధిత అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన చేసి, పాడైపోయిన బోరును బాగు చేసి ట్యాంకుల ద్వారా నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. స్థానిక సిపిఎం నాయకులు దీసరి వసంతరావు మాట్లాడుతూ త్రాగునీటి సమస్య పరిష్కారం చేయకపోతే మా గ్రామం నుంచి పాదయాత్రగా ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా నాయకుడు కోరాడ ఈశ్వరరావు, మహిళలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///