చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకోవాలి…ఉపవిద్యా శాఖ అధికారి బాలాజీఘనంగా నగరపాలక ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం

మనన్యూస్,తిరుపతి:విద్యార్థులు చిన్నప్పటినుంచే క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకోవాలని తిరుపతి ఉప విద్యాశాఖ అధికారి బాలాజీ తెలిపారు. గురువారం కొర్లగుంట లోని నగరపాలక ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం ప్రధానోపాధ్యాయురాలు ఎం జ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉపవిద్య శాఖ అధికారి బాలాజీ, ఎంఈఓ 2 భాస్కర్ నాయక్, అక్కారం పల్లి ఎం సి పి ఎస్ స్కూల్ హెచ్ఎం హరిప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప విద్యాశాఖ అధికారి బాలాజీ మాట్లాడుతూ పాఠశాలలో పిల్లలకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగిందని, నాణ్యమైన విద్యను బోధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. పిల్లలను పాఠశాలలకు విధిగా పంపే అలవాటును తల్లిదండ్రులు అలవర్చుకోవాలని, పాఠశాల ఆవరణం లోకి వచ్చిన తర్వాత వారికి విద్య బుద్ధులను నేర్పడం మా ఉపాధ్యాయుల వంతు అని చెప్పారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి టు భాస్కర్ నాయక్ మాట్లాడుతూ మొదటినుంచి కొర్లకుంట నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో ఎక్కువమంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, విద్యార్థులకు అనుగుణంగా బోధన పద్ధతులను ఉపాధ్యాయులు బోధిస్తున్నారన్నారు. విద్యతో పాటు శారీరక దృఢత్వం ఏర్పడేందుకు ఆటల పోటీలు ప్రతిరోజు సాయంత్రం ఒక గంట పాటు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. పాఠశాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానోపాధ్యాయురాలు ఎం జ్యోతి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు గత వారం రోజులుగా విద్యార్థులకు క్రీడలతోపాటు సంస్కృతిక పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ జీవిత, విజయవాణి ప్రింటర్స్ ,విద్యాసంస్థల ప్రతినిధి మౌనిక ఆర్థిక సహకారం తో విద్యార్థులకు నోట్ బుక్స్, స్టోరీ బుక్స్ వితరణ చేయడం జరిగింది. అంగన్వాడి ఉపాధ్యాయురాలు శాంతి, విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.

  • Related Posts

    వైసీపీ నేత ఎమ్మిలి వీరబాబు ను పరామర్శించిన ముద్రగడ గిరిబాబు

    కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం మెరక చామవరం గ్రామంలో వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పర్యటించి వైసిపి కార్యకర్తలను నాయకులను అభిమానులను కలిశారు. మెరక చామవరం గ్రామానికి చెందిన వైసిపి నాయకులు ఎమ్మిలి వీరబాబు ఇటీవల కాలంలో అనారోగ్యంతో…

    జగన్ పై అభిమానం ప్రజల్లో చెరగని ముద్ర…

    శంఖవరం మన న్యూస్ (అపురూప్): కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పర్యటించి వైసిపి కార్యకర్తలు నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. అన్నవరం దేవస్థానంలో వ్రత పురోహితులు పెండ్యాల రాము, సుబ్రహ్మణ్యం (తండ్రి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    వైసీపీ నేత ఎమ్మిలి వీరబాబు ను పరామర్శించిన ముద్రగడ గిరిబాబు

    • By APUROOP
    • April 25, 2025
    • 5 views
    వైసీపీ నేత ఎమ్మిలి వీరబాబు ను పరామర్శించిన  ముద్రగడ గిరిబాబు

    జగన్ పై అభిమానం ప్రజల్లో చెరగని ముద్ర…

    • By APUROOP
    • April 25, 2025
    • 3 views
    జగన్ పై అభిమానం ప్రజల్లో చెరగని ముద్ర…

    కత్తిపూడి లో ఉగ్రదాడి మృతులకు జనసేన కన్నీటి సంతాపం..

    • By APUROOP
    • April 25, 2025
    • 2 views
    కత్తిపూడి లో ఉగ్రదాడి మృతులకు జనసేన కన్నీటి సంతాపం..

    అన్నవరం సర్పంచ్ కుమార్ రాజాకు అరుదైన గౌరవం

    • By APUROOP
    • April 24, 2025
    • 4 views
    అన్నవరం సర్పంచ్ కుమార్ రాజాకు అరుదైన గౌరవం

    సరస్వతి శిశు మందిర్ లో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు

    సరస్వతి శిశు మందిర్ లో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు

    మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు

    మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు