జర్నలిస్ట్ రాపోలు లింగస్వామి కి ఉగాది పురస్కారం

మనన్యూస్:సుప్రీం కోర్టు 48వ మాజీ ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ చేతుల మీదుగా అవార్డు స్వీకరణ,తెలుగు జర్నలిస్ట్ ల సంక్షేమ సంఘం ప్రతి సంవత్సరం ఉగాది పురస్కారాలను పలు విభాగలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జర్నలిస్ట్ లకు అవార్డుల ప్రదానం చేస్తుంది. (2024-2025)సంవత్సరానికి గాను ఈ అవార్డుల జాభితాను టి జె ఎస్ ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు తాజాగా ప్రకటించారు. ఈ సంవత్సరానికి గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో అర్వులైన పలువురు జర్నలిస్టుల 100 మంది పేర్లను ప్రకటించగా తెలంగాణ రాస్ట్రం హైదరాబాద్ కు చెందిన జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త రాపోలు లింగస్వామిని మనవీయ కోణాన్ని ఆవిష్కరించిన జర్నలిస్ట్ గా ఎంపిక అవ్వడం జరిగింది. విజయవాడ లో తుమ్మలపల్లి కలక్షేత్రంలో తెలుగు జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉగాది పురస్కారం ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ (మాజీ) హాజరై నిర్వాహకులతో కలిసి రాపోలు లింగస్వామి కి ఉగాది పురస్కారం, ప్రశంశ పత్రం, 5000 రివార్డు, శాలువా తో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విలువలరో కూడిన పాత్రికేయులకు సమాజంలో ఎల్లప్పుడూ గౌరవం ఉంటుందన్నారు.అప్పట్లో తాను కూడా పాత్రికేయు రంగంలో పనిచేసిన అనుభవాలతో కూడిన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.పాత్రికేయ రంగం పై ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలల్లో విలువలతో కూడిన ఉత్తమ జర్నలిస్ట్ లకు ఉగాది పురస్కారం తో సత్కరించిన తెలుగు జర్నలిస్ట్ ల సంక్షేమ సంఘం భవిష్యత్లో మరిన్ని కార్యక్రమాలను నిర్వహించాలని ఆకాక్షించారు. సామాన్య మధ్య తరగతి కుటుంబం లో పుట్టిన రాపోలు లింగస్వామి హైదరాబాద్ లో జర్నలిస్ట్ గా పని చేస్తూనే ఆర్ టి ఐ, సామజిక కార్యకర్తగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తన వంతు నిరంతరం కృషి కి ఫలితంగా గతంలో పలు అవార్డులు, ప్రముఖుల నుండి ప్రశంసలు, సమాజంలో తన కంటూ ఒక ప్రత్యేకత ను చాటుకుంటున్న రాపోలు లింగస్వామి కి తాజగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్తమ జర్నలిస్ట్ ల జాభితాలో మానవీయ కొణాన్ని ఆవిష్కరించిన జర్నలిస్ట్ గా ఉగాది పురస్కారం ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ (మాజీ)చేతుల మీదుగా అందుకోవడం తో అతని సేవలను గుర్తు చేస్తూ పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా