ప్రజల మన్ననలు పొందే విధంగా విధులు నిర్వర్తించాలి

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ మంగళవారం మధ్యాహ్నం మరికల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి, పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి అడిగి తెలుసుకున్నారు ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఉంటే నేరుగా ఆఫీస్ లో సంప్రదించవచ్చని తెలిపారు. పోలీస్ స్టేషన్లో పెండింగ్ లో ఉన్న కేసులు, దర్యాప్తు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.పోలీస్ స్టేషన్ లో రోజువారిగా నమోదవుతున్న ఫిర్యాదులు గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో 5 ఎస్ ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ శాఖ అత్యంత బాధ్యతాయుతమైన వ్యవస్థ అని ప్రతి ఒక్కరు అంకితాభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించి ప్రజల మన్ననలు పొందే విధంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. కోర్టులో నిందితులకు శిక్షలు పడేలా భౌతిక సాక్షంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాలని తెలియజేశారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. దొంగతనాల నిర్మూలన కొరకు నిఘా ఏర్పాటు చేయాలని, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడకుండా పటిష్టంగా పెట్రోలింగ్ నిర్వహించాలని పేర్కొన్నారు. రహదారి వెంట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి ప్రమాదాలను నివారించడానికి కృషి చేయాలని తెలియజేశారు. ఆర్థిక నేరాలకు కట్టడి చేయడానికి సీసీ టీవీ కెమెరాలు అమర్చే విధంగా ప్రజలకు చైతన్య పరచాలి అని పేర్కొన్నారు. సైబర్ నేరాలపై, 1930 టోల్ ఫ్రీ నెంబర్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలు తీసుకొచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులకు భద్రతా, భరోసా కల్పించే విధంగా పోలీస్ వ్యవస్థ ఉండాలని ప్రజలు ఎటువంటి సమాచారమైనా డయల్ – 100 ద్వారా తెలుపవచ్చు అని సూచించారు. బ్లూ కోట్స్, పెట్రో కార్ సిబ్బంది రాత్రి సమయంలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని, రౌడీ షీటర్స్, కేడీలు, సస్పెక్ట్ ఇళ్లను తనిఖీ చేయాలని, పాయింట్ బుక్స్ ను తనిఖీ చేయాలని గ్రామాలలో ప్రధాన కూడళ్ల వద్ద విజిబుల్ పోలీసింగ్ ఉండాలని నేరాల నివారణకు ఆకస్మికంగా వాహనాల తనిఖీలు నిర్వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఐ రాజేందర్ రెడ్డి, ఎస్ ఐ రాము, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 8 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//