పేదవాడి చదువు. పదునైన ఆయుధం వంటిది..చదువుల తల్లికి అభినందనలు…

మన న్యూస్ శంఖవరం (అపురూప్): పేదవాడి చదువు. పదునైన ఆయుధం వంటిది అని చదువుల తల్లి కొంకిపూడి నవ్య శ్రీ కి శంఖవరం అంబేద్కర్ కాలనీ నివాసులు అభినందనలు తెలిపారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం అంబేద్కర్ కాలనీకి చెందిన కొంకిపూడి రాజు, తల్లి దుర్గ ప్రధమ సంతానం కొంకిపూడి నవ్య శ్రీ. వ్యవసాయ పనులు చేస్తూ జీవనం కొనసాగించే కుటుంబం లో పుట్టి ఆర్థిక పరిస్థితులతో సతమతమవుతున్న పరిస్థితులు ఎన్నో.. ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి సరైన వసతులు ఆర్థిక స్తోమత లేక శంఖవరం స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆరో తరగతి లో చేరి ప్రతి ఏటా ప్రతి తరగతులో ప్రథమ స్థానాన్నికైవసం చేసుకుంటూ, ప్రధమ స్థానానికి అలవాటు పడి పదవ తరగతిలో 533/600 సాధించి కస్తూర్బా గాంధీ విద్యాలయానికే ఘనత తెచ్చింది. 2024-2025 సంవత్సరంలో 11వ తరగతి ఎంపీసీ చదువుతూ ఇటువలే చివరి పరీక్షలకు హాజరయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం శనివారం వెల్లడించిన ఫలితాలలో కాకినాడ జిల్లా లో గల శంఖవరం, తొండంగి తుని, కోటనందూరు మండలాలలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో శంఖవరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి చెందిన కొంకిపూడి నవ్య శ్రీ 11వ తరగతి ఎంపీసీ 438/470 మార్కులు సాధించి కాకినాడ జిల్లాలో గల నాలుగు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా శంఖవరం అంబేద్కర్ నగర్ కాలనీ నివాసులు చదువుల తల్లి మా కాలనీలో పుట్టిందంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శంకవరం మండల విద్యాశాఖ అధికారి సూరిశెట్టి వెంకటరమణ, శుభాకాంక్షలు బాలికల విద్యాలయ ప్రిన్సిపాల్ బి. బాల కుమారి, కేజీబీవీ సిబ్బంది, శంఖవరం స్థానిక జై భీమ్ యూత్ సభ్యులు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.

  • Related Posts

    పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

    మన న్యూస్, నెల్లూరు : నిరుపేదలు తమ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించే క్రమంలో వారు పడుతున్న ఇబ్బందులను దగ్గర్నుంచి చూశాను కాబట్టే.. ప్రతి స్టూడెంట్ కి నాణ్యమైన విద్యను అందించాలని వి ఆర్ హైస్కూల్ ని తీర్చిదిద్దుతున్నానని మంత్రి పొంగూరు…

    మూడవ రోజు రాత్రి వాహన సేవ

    మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు (08-06-2025, ఆదివారం) రాత్రి 8 గంటలకు హంస వాహన సేవను వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారు హంస…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

    పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర  పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

    మూడవ రోజు రాత్రి వాహన సేవ

    మూడవ రోజు రాత్రి  వాహన సేవ

    మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

    మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

    నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర