బీసీలకు రిజర్వేషన్ బీఎస్పీ తోనే సాధ్యం

  • బీసీ రిజర్వేషన్ పెంచాలంటూ నినాదాలతో దద్దరిల్లిన కాకినాడ కలెక్టర్…

మనన్యూస్ కాకినాడ కలెక్టరేట్ (అపురూప్) బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ కార్యాలయం బహుజన నినాదాలతో బీసీలకు 52 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ నినాదాలతో దద్దరిల్లింది. కాకినాడ జిల్లా కలెక్టర్ కి రోడ్డుపై బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు బీసీ సంఘం నాయకులు వినత పత్రం సమర్పించారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల ప్రకారం కాకినాడ జిల్లాలో బీసీలకు 52 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాత సుబ్రహ్మణ్యం (సుబ్బు భాయ్) ఆధ్వర్యంలో బీసీ సంఘాలను బీసీ నాయకులను కలుపుకొని బీసీ సమరభేరి పేరుతో కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీసీల తరఫునుంచి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పంపన రామకృష్ణ బాధ్యత తీసుకోగా బీసీ సంఘ నాయకులు చోల్లంగి వేణుగోపాల్ బహుజన నాయకులు అయినవిల్లి నారాయణ గౌడ్, బీసీ కులాల అధ్యక్షులు మాకినీడు భాస్కరరావు, బీసీ సంఘ నాయకులు పప్పు దుర్గా రమేష్, సామాజిక న్యాయ సాధన సమితి అధ్యక్షులు కోరుకొండ భానుమతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు, బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ, అత్యధిక జనాభా కలిగిన బీసీలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని, బీసీలు మొనగాడ సాధిస్తారని ఓర్వలేక కులగణన చేయడం లేదని మండిపడ్డారు. బహుజనుల అభివృద్ధికి తోడ్పడిన పార్టీలకు మాత్రమే మద్దతిస్తామని బీసీలకు రిజర్వేషన్ బిఎస్పి పార్టీతోనే సాధ్యమని, రాష్ట్రస్థాయిలో బహుజనుల పార్టీ అయిన బీఎస్పీ ద్వారా బిసి రిజర్వేషన్ సాధిస్తామని అన్నారు. దళిత సంఘ నాయకులు పండు అశోక్ కుమార్ తోటి చెంగల్ రావు పాల్గొనగా బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా కమిటీ ముఖ్య పాత్ర పోషించగా అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలు అధ్యక్షులు ఆయ నియోజకవర్గాల కార్యకర్తలు నాయకులతో ధర్నా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఇన్చార్జ్ సబ్బారాపు అప్పారావు కాకినాడ జిల్లా జనరల్ సెక్రెటరీ కండవల్లి లోవరాజు బివిఎఫ్ జిల్లా కన్వీనర్ ప్రత్తిపాటి బుల్లి రాజు, జిల్లా ట్రెజరర్ సాధనాల రాజు, ప్రత్తిపాడు నియోజకవర్గ అధ్యక్షులు అపురూప్, కొంగు రమేష్ బత్తిన తాతాజీ, గునపర్తి రాఘవ, కాకినాడ సిటీ అధ్యక్షులు బుంగ చక్రవర్తి కాకినాడ జిల్లాలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///