

మన న్యూస్: హేమామహేశ్వర నియోజకవర్గం తుక్కుగూడ సమీపంలోని ఇమామ్ గూడలో వంశీధర్ రెడ్డి,దోమ హరీష్ రెడ్డి, బి. అమిత్ రాజ్ రెడ్డి, అనిరుద్, ధీరజ్ రెడ్డి, అర్వింద్ రెడ్డి, నిఖిల్ ల సంయుక్త నేతృత్వంలో పిస్తా హౌస్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.ఈ ప్రారంభోత్సవంలో పిస్తా హౌస్ ఫౌండర్ మొహమ్మద్ అబ్దుల్ మజీద్ హాజరై యాజమాన్యాన్ని అభినందించారు.ఈ సందర్భంగా ఫౌండర్ మొహమ్మద్ అబ్దుల్ మజీద్ మాట్లాడుతూ పిస్తా హౌస్ ను ఆదరిస్తున్నటువంటి ప్రజలకు తన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కె.ఎల్.ఆర్, అందెల శ్రీరాములు యాదవ్ స్థానిక నాయకులు హాజరయ్యారు.