ఘనంగా మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి వేడుకలుఫూలే దంపతుల విగ్రహం వద్ద ఘన నివాళి

నర్వ మండలం ఏప్రిల్ 11 ( మన న్యూస్)ఎందరో మహనీయుల పోరాట ఫలితంగానే అన్ని హక్కులు సాధించుకోగలిగామని,ఆ మహనీయుల్లో మహాత్మా జ్యోతి రావు ఫూలే ఆదర్శప్రాయుడని ఉపాద్యాయులు యం.మల్లేశ్,ఉస్మాన్ అన్నారు.శుక్రవారం ఫూలే జయంతిని పురస్కరించుకుని నర్వ మండల పరిధిలోని రాయికోడ్ గ్రామంలో పూలే కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలకు వారు హాజరయ్యారు.ఫూలే విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.అంటరానితనం,కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసి తన జీవితాన్ని వెనుకబడిన వర్గాల అభివృద్ధికి అంకితం చేసిన మహాత్మా జ్యోతిబా పూలే 198వ జయంతిని రాయికోడ్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు.పూలే విగ్రహ వ్యవస్థాపకులు యం.శంకర్ ఆధ్వర్యంలో గ్రామంలోని పూలే దంపతుల విగ్రహాలకు గ్రామపెద్దలు,యువకుల సమక్షంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లేష్ మాట్లాడుతూ కుల,మత,వర్గ,వర్ణంతో ముడిపడిన మూఢాచారాలు,సామాజిక కట్టుబాట్లు అనే సంకెళ్లను తెంపి,సమసమాజ స్థాపనకు ఎనలేని కృషి చేసి భారత దేశ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహాత్మ జ్యోతిరావు పూలే జీవితం మనందరికీ ఆదర్శం అన్నారు.ఆధునిక భారతదేశంలో సామాజిక న్యాయం, మహిళా సాధికారత ఉద్యమాలకు ఆద్యుడు పూలే అని ప్రశంసించారు.విద్యతోనే సమసమాజ స్థాపన,అభివృద్ధి సాధ్యమని నమ్మి ఆ దిశగా విశేష కృషి చేసిన గొప్ప దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు.భారతదేశ చరిత్రలోనే బాలికల కోసం సొంతంగా ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పి స్త్రీ విద్యా వ్యాప్తికి విశేష కృషి చేసిన గొప్ప విద్యావేత్త జ్యోతి బాపూలే అన్నారు.ఆనాటి ఆధిపత్య వర్గాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మొక్కవోని దీక్షతో తన భార్య సావిత్రిబాయి పూలే కు స్వయంగా చదువు చెప్పి,ఉపాధ్యాయ శిక్షణను ఇప్పించి తాను నెలకొల్పిన పాఠశాలల్లో ఆమె ద్వారా విద్యా బోధన చేయించటం జరిగిందన్నారు.సమాజంలో కులవ్యవస్థ నిర్మూలనకోసం,స్త్రీ,పురుషులకు సమాన హక్కుల కోసం ఎంతగానో పోరాడిన సామాజిక యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే చూపిన బాటలో మనమంతా నడవాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో రాయికోడ్ హెడ్ మాస్టర్ రాయల్ హెన్నా, ఉపాధ్యాయురాలు రాధారాణి పూలే కమిటి వ్యవస్థాపకులు,అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు యం.శంకర్,మాజీ ఎంపిపి కొండా జయరాములు శెట్టి,వివిధ పార్టీల ముఖ్య నాయకులు కె.యన్.స్వామి,ఎం.నారాయణరెడ్డి,మన్సూర్ పాష,నౌసు వెంకటయ్య,పి అంజి,బి.రవి కుమార్,పూలే కమిటీ సభ్యులు పి.రవి కుమార్,ముస్టిపల్లి రామాంజనేయులు గౌడ్,వార్డు సభ్యులు రాము,భీమేష్ మేస్త్రి,నర్సన్ గౌడ్,సీపూర్ ఈశ్వర్,యువకులు టి.రమేష్,కే. నారి,బి.శివశంకర్,కే.చింటూ,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ). జిల్లా కేంద్రానికి సరిహద్దుల్లో ఉన్న పత్తి మిల్లులను, సరిహద్దులోని చెక్ పోస్టులను అదనపు కలెక్టర్ వి. విక్టర్ పరిశీలించారు.మద్నూర్ మండలంలోని మంగళవారం అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన చెకో పోస్టును తనిఖీచేశారు.చెక్ పోస్టు సిబ్బందికి పోలీసులకు…

రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గ ఈఆర్ వో (ఓటరు నమోదు అధికారి), జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

  • By RAHEEM
  • October 29, 2025
  • 2 views
ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

  • By RAHEEM
  • October 29, 2025
  • 4 views
రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

  • By RAHEEM
  • October 29, 2025
  • 3 views
నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

  • By RAHEEM
  • October 29, 2025
  • 4 views
ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

  • By RAHEEM
  • October 29, 2025
  • 3 views
దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

  • By RAHEEM
  • October 28, 2025
  • 8 views
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్