రాజ్యాంగ వ్యతిరేకమైన వక్ఫ్ చట్ట సవరణను రద్దు చేయాలి — ఆవాజ్ డిమాండ్—ఆవాజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ అబ్దుల్ సుభాన్.

మన న్యూస్: కడప జిల్లా: ఏప్రిల్ 10: కడప నగరం ఆవాజ్ కార్యాలయం నందు ఆవాజ్ కమిటీ జిల్లా విస్తృత సమావేశం పి చాంద్ భాషా అధ్యక్షతన జరిగింది,ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆవాజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ ,అబ్దుల్ సుభాన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,కేంద్ర ప్రభుత్వం తనకున్న మందబలంతో రాజ్యాంగం నిర్దేశించిన సూత్రాలను తుంగలో తొక్కి భారతదేశ భిన్నత్వంలో ఏకత్వం అనే సందేశాన్ని ప్రపంచానికి చాటిన ప్రజల మధ్య మత ఉన్మాదాన్ని పెంచి పోషిస్తూ ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేస్తూ రాజ్యాంగం మైనార్టీలకు కల్పించిన హక్కులను హరిస్తుందని,వక్ఫ్ చట్ట సవరణ ద్వారా ముస్లిం మైనార్టీ సమాజానికి మేలు జరుగుతుందని, కాపాడబడుతాయని ముస్లింల అభివృద్ధి జరుగుతుందని బిజెపి ప్రభుత్వం చెప్పడం ఆ సామాజిక తరగతిని మోసగించడమే అని అన్నారు.నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు కేంద్ర ప్రభుత్వం ముస్లిం ప్రజలకు వ్యతిరేకమైన చట్టాలను చేయడమే తప్ప మెరుగుపరిచింది ఎక్కడ అని ప్రశ్నించారు. అలాల్ పేరుతో హిజాత్ పేరుతో అజాం పేరుతో ఆహారం పేరుతో త్రిపుల్ తలా పేరుతో ఇతర అనేక రూపాలలో ముస్లిం మైనార్టీలపై భౌతిక దాడులు చేయడం.సామూహిక హత్యలు చేయడం మానవ కనడాన్ని సృష్టించడమే పనిగా కేంద్ర బిజెపి ప్రభుత్వం పెట్టుకున్నది. వక్ఫ్ నిర్వహణలో లోపాలు ఉన్నాయని ఉంటే సరిచేసి వారికి స్వాధీనపరిచి ప్రజాతంత్ర పద్ధతిలో బోర్డును నిర్వహించవలసిన వారు రాజకీయ పార్టీల వేదికల వక్ఫ్ బోర్డు ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహారం తలనొస్తుందని వైద్యం కోసం పోతే తల తీసేయండి అని అన్నాడంట అలా ఉంది అన్నారు. బిజెపి మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని. భారతదేశాన్ని దేశ ప్రజాస్వామ్యాన్ని చిర చరాస్తులు ఐక్యతను లౌకిక విధానాలను ప్రేమించి గౌరవించే భరతమాత సేవ చేసే బిడ్డలందరును ఐక్యపరిచి నల్ల చట్టాలు వ్యతిరేకంగా పోరాటాలకై ప్రయత్నిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆవాజ్ కమిటీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్,అన్వర్ భాష ,ఎస్,అబ్దుల్ సత్తార్,ఎస్,షరీఫ్,ఎస్,ఖాదర్ బాషా, ఎస్ మెహబూబ్ భాష ,ఆవాజ్ జిల్లా మహిళా నాయకులు గౌసియా, జమీల,బిబి,ఆవాజ్ జిల్లా కమిటీ సభ్యులు భాష వల్లి,జహంగీర్,జాఫర్, అబ్దుల్ రెహమాన్,సాహిబ్ ,ఖలీల్, తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..