
మన న్యూస్:కలిగిరి
పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి అనుమానస్పద మృతికి కలిగిరి మండలం లోని పాస్టర్లు, క్రైస్తవులు బుధవారం ఉదయం శాంతియుత ర్యాలీ నిర్వహించారు… కలిగిరి లోని స్థానిక బస్టాండ్ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది.. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండాలని కోరారు..అనంతరం తాసీల్దార్ వారి కార్యాలయంలో వినతిపత్రం అందించి ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు… ఈ కార్యక్రమానికి MRPS నాయకులు, ముస్లిం మైనార్టీ నాయకులు మద్దతుగా నిలిచారు..