నెల్లూరులో దివంగత ఆనం వివేకానందరెడ్డి ‘కాంస్య విగ్రహ’ ఏర్పాటుకు స్థలం కేటాయించాలి……..కమిషనర్ కు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజ్ఞప్తి

మన న్యూస్, నెల్లూరు రూరల్,ఏప్రిల్ 9 :నెల్లూరు నగరంలో దివంగత ఆనం వివేకానంద రెడ్డి కాంస్య విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నగర కార్పొరేషన్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఓ లేఖ రాశారు. మాజీ శాసనసభ్యులు దివంగత ఆనం వివేకానందరెడ్డి ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం నెల్లూరు ప్రజలకు సేవలు అందించారన్నారు. నెల్లూరు మునిసిపల్ వైస్-చైర్మన్ గా, చైర్మన్ గా, కో-ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ గా, నెల్లూరు శాసనసభ్యులుగా రెండు సార్లు మరియు నెల్లూరు రూరల్ శాసనసభ్యులుగా ఒకసారి పనిచేశారన్నారు. సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో వారు ప్రజలకు ఏనలేని సేవలు అందించారని వారి కాంస్య విగ్రహం నెల్లూరులో ఏర్పాటు చేయటం అందరి భాద్యతగా భావిస్తున్నామన్నారు.ఇందుకు సంబంధించి, కార్పొరేషన్ తరపున స్థలం కేటాయిస్తే నా స్వంత ఖర్చులతో వారి కాంస్య విగ్రహం ఏర్పాటుకి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆనం వివేకానందరెడ్డి కుటుంబసభ్యులను, ఆనం వివేకానందరెడ్డి అభిమానులు, వారితో సుదీర్ఘకాలం పాటు రాజకీయాలలో ప్రయాణించిన వారిని కలుపుకొని ఈకార్యక్రమం చేపట్టాలని తన ఆకాంక్ష అన్నారు.పొదలకూరు రోడ్డులో పెద్దాస్పిటల్ (GGH) వెనుక భాగంలో ఇప్పటికే ఐ-ల్యాండ్ నిర్మాణం జరిగి ఉందని దానిని మరింత ఆధునీకరించి, కాంస్య విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయింపు చేసినట్లయితే, బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అయితే ఇందులో అంతిమ నిర్ణయం ఆనం వివేకానందరెడ్డి కుటుంబసభ్యులదేనని, మీరు పూర్తి భాద్యత తీసుకొని, వారి కుటుంబసభ్యులతో చర్చించి, అత్యంత వేగవంతంగా స్థల కేటాయింపు చేస్తారని ఆ లేఖలో పేర్కొన్నారు.

  • Related Posts

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    సీతారామపురం అక్టోబర్ 29(మన ధ్యాస న్యూస్) రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా సీతారామపురంలోని కురవ వీధిలో బండి రోశమ్మ ఇంటి ప్రహరీ గోడ కూలింది మరియు ఇల్లు లోపల గోడ కూడా పాక్షికంగా దెబ్బతిని పడే స్థితిలో ఉన్నదని…

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!