నెల్లూరులో దివంగత ఆనం వివేకానందరెడ్డి ‘కాంస్య విగ్రహ’ ఏర్పాటుకు స్థలం కేటాయించాలి……..కమిషనర్ కు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజ్ఞప్తి

మన న్యూస్, నెల్లూరు రూరల్,ఏప్రిల్ 9 :నెల్లూరు నగరంలో దివంగత ఆనం వివేకానంద రెడ్డి కాంస్య విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నగర కార్పొరేషన్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఓ లేఖ రాశారు. మాజీ శాసనసభ్యులు దివంగత ఆనం వివేకానందరెడ్డి ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం నెల్లూరు ప్రజలకు సేవలు అందించారన్నారు. నెల్లూరు మునిసిపల్ వైస్-చైర్మన్ గా, చైర్మన్ గా, కో-ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ గా, నెల్లూరు శాసనసభ్యులుగా రెండు సార్లు మరియు నెల్లూరు రూరల్ శాసనసభ్యులుగా ఒకసారి పనిచేశారన్నారు. సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో వారు ప్రజలకు ఏనలేని సేవలు అందించారని వారి కాంస్య విగ్రహం నెల్లూరులో ఏర్పాటు చేయటం అందరి భాద్యతగా భావిస్తున్నామన్నారు.ఇందుకు సంబంధించి, కార్పొరేషన్ తరపున స్థలం కేటాయిస్తే నా స్వంత ఖర్చులతో వారి కాంస్య విగ్రహం ఏర్పాటుకి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆనం వివేకానందరెడ్డి కుటుంబసభ్యులను, ఆనం వివేకానందరెడ్డి అభిమానులు, వారితో సుదీర్ఘకాలం పాటు రాజకీయాలలో ప్రయాణించిన వారిని కలుపుకొని ఈకార్యక్రమం చేపట్టాలని తన ఆకాంక్ష అన్నారు.పొదలకూరు రోడ్డులో పెద్దాస్పిటల్ (GGH) వెనుక భాగంలో ఇప్పటికే ఐ-ల్యాండ్ నిర్మాణం జరిగి ఉందని దానిని మరింత ఆధునీకరించి, కాంస్య విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయింపు చేసినట్లయితే, బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అయితే ఇందులో అంతిమ నిర్ణయం ఆనం వివేకానందరెడ్డి కుటుంబసభ్యులదేనని, మీరు పూర్తి భాద్యత తీసుకొని, వారి కుటుంబసభ్యులతో చర్చించి, అత్యంత వేగవంతంగా స్థల కేటాయింపు చేస్తారని ఆ లేఖలో పేర్కొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..