సాలూరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించింది

మన న్యూస్ సాలూరు ఏప్రిల్8:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ అభివృద్ధి దిశగా మరో ముందడుగు పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజన్‌ను అమలు పరచే భాగంగా, సాలూరు మార్కెటింగ్ కమిటీకి నూతన పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించింది. ఇందులో ముఖి సూర్యనారాయణ చైర్మన్‌ ఇతర సభ్యులు సహా వైస్ చైర్మన్‌ మింది సింహాచలం, ఎంపికయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నూతన పాలకవర్గ సభ్యులందరిని ఘనంగా సన్మానించి, హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ: “వ్యవసాయ రంగం అభివృద్ధికి మార్కెటింగ్ కమిటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. రైతుల ఉత్పత్తులకు సరైన ధర, సమర్థమైన మౌలిక వసతులు, పారదర్శక విధానాల అమలులో ఈ కమిటీల పాత్ర అమూల్యమైనది. ముఖి సూర్యనారాయణ, అనుభవం కలిగిన, వ్యవసాయ సమస్యల పట్ల లోతైన అవగాహన కలిగిన నాయకులు. ఆయన నాయకత్వంలో ఈ కమిటీ రైతుల సంక్షేమానికి అనేక విలువైన నిర్ణయాలు తీసుకుంటుందని నమ్మకంగా చెప్పగలను. ఇతర సభ్యులైన వైస్ చైర్మన్ మింది సింహాచలం . మరియు 15 మంది కమిటీ సభ్యులకు కూడా మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. వారు తమ సమయపాలన, ప్రజాసేవా మనోభావంతో సాలూరు నియోజకవర్గ రైతాంగానికి శక్తివంతమైన మద్దతుగా నిలవాలని ఆకాంక్షించారు. రైతులు బలపడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఈ నూతన పాలకవర్గం రైతుల ఆశల్ని నెరవేర్చేందుకు కృషి చేస్తుందని ఆశిస్తున్నాను,అని గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..