కోవూరు పరిశ్రమలు పాడి పంటలతో అభివృద్ధి చెందాలి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మనన్యూస్,కోవూరు:శ్రీరామనవమి సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
కోవూరు నియోజకవర్గ ప్రజానీకానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆమె నియోజకవర్గ పరిధిలోని పడుగుపాడు, రాజుపాళెం, జమ్మిపాళెం గ్రామాలలోని రామాలయాలను సందర్శించి రాముల వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా సీతారాముల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆకాంక్షించారు. కోవూరు నియోజకవర్గం పాడి పంటలు పరిశ్రమలతో అభివృద్ధి చెందాలని ప్రార్ధించారు. ఎంతటి విషమ పరిస్థితుల్లోనైనా సత్యం, ధర్మానికి కట్టుబడి ఉండాలన్న సందేశాన్ని శ్రీరాముని జీవితం మనకు అందిస్తుందన్నారు. \శ్రీరాముడు ఆచరించి చూపిన జీవన ప్రమాణాలు మనకు ప్రతి దశలోనూ స్ఫూర్తినిస్తాయని ఆమె తెలిపారు. సీతారాముల ఆదర్శ జీవితం భారతీయ కుటుంబ ఔన్నత్యాన్ని చాటుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా ఛైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణా రెడ్డి, అడపాల శ్రీధర్ రెడ్డి, DCN శ్రీనివాసులు, ఇరువూరు శ్రీధర్ రెడ్డి, గాదిరాజు అశోక్, కొల్లారెడ్డి సునీల్ రెడ్డి, కరేటి శీను, గుత్తికొండ వెంకయ్య, పెంచలయ్య, పురుషోత్తం, కరేటి అమరావతి, రాకి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..