

మనన్యూస్,కోవూరు:ఎమ్మెల్యే ప్రశాంతమ్మ అసెంబ్లీలో ప్రస్తావించిన కారణంగానే షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించింది.28 కోట్ల బకాయిలు చెల్లించేందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ధన్యవాదాలు.13 ఏళ్లుగా తాము చేస్తున్న పోరాటం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కృషితో ఫలించిందన్నారు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు. నెల్లూరు నగరం మాగుంట లే అవుట్ లోని ఆమె నివాసంలో షుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘ నాయకులు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి పుష్ప గుచ్ఛం యిచ్చి కృతజ్ఞతలు తెలియచేసారు.ఈ సందర్భంగా కార్మిక సంఘ నాయకులు మీడియాతో మాట్లాడుతూ కార్మికులకు చెల్లించాల్సిన 28 కోట్ల బకాయిలను చెల్లించేలా ప్రభుత్వాన్ని ప్రభావితం చేయడంలో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు. తమ పట్ల మానవతా దృక్పధంతో వ్యవహరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి కార్మికుల కుటుంబాల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. 13 ఏళ్లుగా దుర్భరమైన తమ జీవితాల్లో కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంతమ్మ వెలుగులు నింపారన్నారు. తమ గొంతుకై నిలిచి 13 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపునకు మార్గం సుగమం చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి కార్మిక కుటుంబాలు రుణపడి ఉంటాయన్నారు. ఇప్పటి దాకా తాము మాటలు చెప్పి మభ్య పెట్టే నాయకులను చూశామని చెప్పిన మాటకు కట్టుబడ్డ నాయకురాలిని తొలిసారిగా చూస్తున్నామన్నారు. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో బుచ్చిరెడ్డిపాలెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రచారంలో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతమ్మ.. ఇదే విషయంపై తమ వైఖరిని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీ మేరకు ఎన్నికలయ్యాక కోవూరు షుగర్ ఫ్యాక్టరీ బకాయిలపై ప్రశాంతమ్మ దృష్టి సారించారు.కోవూరును ఇండస్ట్రియల్ హబ్ గా అభివృద్ధి చేస్తాం.అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి కార్మికుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ సాకారం అవుతుండటంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఇది ప్రజా ప్రభుత్వమని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రియల్టర్లకు కట్టబెట్టాలని చూసిన షుగర్ ఫ్యాక్టరీకి చెందిన 124 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి అప్పగించి ఇండస్ట్రీయల్ హబ్ గా మారుస్తామన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో షుగర్ ఫ్యాక్టరీ రైతులకు ఆమోద్యయోగ్యమైన పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘ నేతలు నారాయణ, ఎంవి రమణ, శివ,మస్తాన్ పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, టిడిపి నాయకులు తిరువూరు అశోక్ రెడ్డి, బెజవాడ వంశీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
