పార్టీ ఫిరాయింపు కేసుపై సుప్రీంలో విచారణ 

Mana News, న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుపై సుప్రీం కోర్టులో (Supreme Court) ఈరోజు (బుధవారం) విచారణ ప్రారంభమైంది. బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరుగుతోంది. గత విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈరోజు ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు.ఇప్పటికే స్పీకర్ తరపున స్పీకర్ కార్యదర్శి కౌంటర్‌ను దాఖలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణలను అఫిడవిట్‌లో ఖండించారు. స్పీకర్ చట్టపరమైన విధులను అనుసరిస్తున్నారని, స్పీకర్ నిర్ణయం తీసుకున్న తరువాతే న్యాయపరమైన పరిష్కారం సాధ్యమని, అంతవరకు కోర్టులు స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకోలేరంటూ స్పష్టంగా తన కౌంటర్‌లో దాఖలు చేశారు. స్పీకర్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారనడానికి ఎలాంటి కారణాలు లేవని, స్పీకర్ వద్ద పిటిషన్‌లు పెట్టుకున్న 20 రోజులకే బీఆర్‌ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారని, స్పీకర్‌పై వారు చేసిన ఆరోపణలు అసంబద్ధమైనవని, రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌లోని క్లాజ్ 6 కింద స్పీకర్‌కు ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునేందుకు పూర్తి అధకారాలు ఉన్నాయన్నారు.అంతేకాకుండా అసెంబ్లీ సమావేశమై పదిహేను నెలలు కూడా కాలేదు, అసెంబ్లీ పదవీకాలం ముగిసేలోపు అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోబోరన్న ఆరోపణల్లో కూడా పసలేదని, ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతున్న పిటిషనర్లకు నోటీసులు ఇచ్చామని, వారి ఇచ్చే సమాధానాలు విన్నాక సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని, స్పీకర్ విశేషమైన అధికారాలు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అలాగే మణిపూర్ ఎమ్మెల్యే ఫిరాయింపు కేసులో కూడా 1992లో సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులో కూడా స్పీకర్‌కే నిర్ణయం తీసుకునే అధికారాలు ఉన్నాయన్న విషయాన్ని కూడా కౌంటర్‌లో గుర్తుచేశారు. మరోవైపు ఈ కేసులో పిటిషనర్ల తరుపు వాదనలు విన్న సుప్రీం కోర్టు… గతంలో ఇచ్చిన తీర్పులను కాదని ఎలా చెబుతామని, ఎప్పటిలోగా నిర్ణయం తీసుకోవాలనే దానిపై ధర్మాసనం చెప్పలేదని, వాటికి భిన్నంగా ఎలా నిర్ణయం తీసుకుంటామని సుప్రీం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో ఈరోజు సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో వేచి చూడాలి.

Related Posts

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉరవకొండ మన ధ్యాస: నిమ్న వర్గాల గౌరవానికి సంబంధించిన విషయం బలహీనవర్గాల విజయం అని తెలియజేసిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యల్.నాగేంద్ర కుమార్ భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం ఉప రాష్ట్రపతి బాధ్యతలలో…

సర్పంచుల్లో ఉత్తముడు. వ్యాసాపురం సీతారాముడు.

ఉరవకొండ, మన న్యూస్: మండల పరిధిలోని వ్యాసాపురం సర్పంచ్ సీతారాములు ఉత్తమ సర్పంచుగా ఎంపికైన సంగతి విధితమే. ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించి షాలు ఒక అప్పి పూలమాలలు వేసి మెమొంటోను బహుకరించారు. సర్పంచు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 2 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు