అధికారులపై దాడి చేసింది బీఆర్ఎస్ గూండాలే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల రామనాధం

Mana News:- పినపాక నియోజకవర్గం ప్రతినిధి, మన న్యూస్ నవంబర్, 13, 2024 వికారాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై జరిగిన దాడి వెనుక బీ ఆర్ ఎస్ అరాచక శక్తుల కుట్రేనని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు గొడిశాల రామనాధం అన్నారు. బుధవారం క్రాస్ రోడ్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియా సాక్షిగా చేసిన వ్యాఖ్యలు వారి దిగజారిన రాజకీయాలకు అద్దం పడుతుంది అని రామనాధం అన్నారు. రాజకీయాలలో హుందాగా మాట్లాడాలని.. ఆ హుందా తనం మీలో లోపించిందని .. చిల్లర మాటలు మా విధానం కాదని, చెల్లని రూపాయి మాటలు మాట్లాడి, ప్రజల్లో ఇంకా చులకన కావోద్దని హితవు పలికారు. నాడు ఎన్నికల సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా రేగా కాంతారావు ఈ జిల్లాలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవనివ్వనని ప్రగల్భాలు పలికి.. మీ సీటు నే 35 వేల మెజారిటీ తో చిత్తు చిత్తుగా ఓడిపోయింది మర్చిపోవొద్దు అన్నారు. పది రోజుల్లో మంత్రిని అయ్యి వస్తా అన్నావు.. పత్తా లేకుండా పోయావు.. పదివేల మెజారిటీతో గెలవబోతున్నాము.. కార్యకర్తలు సంబరాలకు సిద్ధం కండి అని అన్నావు, అదీ అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు భద్రాచలం లో ఉప ఎన్నిక కు సిద్దం అవుతున్నారు, అధికారం కోసం అర్రులు చాచటం మీకే చెల్లిందన్నరు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని.. గౌరవప్రద రాజకీయాలు చేయాలని సూచించారు. వికారాబాద్ లో బీ ఆర్ ఎస్ ప్రేరేపించిన, వారి అనుచరుల ముసుగులో ఉన్న గూండాలను తక్షణమే అరెస్టు చేసి, శిక్షించాలని డిమాండ్ చేశారు. సమావేశం లో మాజీ వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉడుముల లక్ష్మారెడ్డి, గంగిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీనివాస రెడ్డి, బండారు సాంబశివరావు, స్వాతంత్ర రెడ్డి, పాయం అప్పారావు, పాడి హేమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • అధికారులపై దాడి చేసింది బీఆర్ఎస్ గూండాలే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల రామనాధం.
  • సోషల్ మీడియాలో మాజీ ఎమ్మెల్యే రేగా చెల్లని రూపాయి మాటలు.
  • ఎమ్మెల్యే పాయం మీద చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్.
  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///