వర్గీకరణ అంతం-మాలల పంతం

మాకొద్దు. మాకొద్దు.. వర్గీకరణ మాకొద్దు..

మన న్యూస్ ప్రతినిథి శంఖవరం:మాలలను,మాదిగలను విభజించి పరిపాలించాలని కుట్ర పన్నుతూ రిజర్వేషన్ ఫలాలను దూరం చేయాలనే ఉద్దేశంతోనే ఎస్సీ వర్గీకరణకు నాంది పలికారని దళిత ప్రజా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,ప్రత్తిపాడు నియోజకవర్గ బీఎస్పీ పార్టీ అధ్యక్షులు,స్థానిక జై భీమ్ యూత్ సభ్యులు గునపర్తి అపురూప్ మండిపడ్డారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం,మండల కేంద్రమైన శంఖవరం స్థానిక జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో వర్గీకరణ అంతం..మాలల పంతం..మాకొద్దు.. మాకొద్దు..వర్గీకరణ మాకొద్దు.. నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా శంఖవరం మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం మండల తహసిల్దార్ కి వర్గీకరణ రద్దు చేయాలని వినతి పత్రాన్ని సమర్పించారు.అనంతరం గునపర్తి అపురూప్ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశంలో వర్గీకరణను ఆమోదిస్తూ బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో మాలలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని ధ్వజమెత్తారు.మాల మాదిగలు ఒక తల్లి కడుపున పుట్టి అన్నదమ్ముల వలె ఉన్న వారి మధ్య చిచ్చులు పెట్టి విడగొట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని అన్నారు.వర్గీకరణ జరిగినంత మాత్రాన మాదిగలు రాజ్యాంగ ఫలాలు పొందలేరని, మాదిగలకు వాసన చూపించి అగ్రకులస్తులే దోచేస్తారని అన్నారు. వర్గీకరణ ఆమోదిస్తూ మాలలకు అన్యాయం చేసిన కూటమి ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో మనుగడ సాధించలేదని,రానున్న ఎన్నికల్లో మాలలు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని తెలిపారు.అన్యాయానికి గురైన దళితులు న్యాయం కొరకు ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదని ఈ సందర్భంగా ఖండించారు.ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ,ప్రత్తిపాడు నియోజకవర్గ బిఎస్పి ఉపాధ్యక్షులు జై భీమ్ యూత్ సభ్యులు కొంగు రమేష్,కాకినాడ జిల్లా వికలాంగుల పోరాట సమితి అధ్యక్షులు జై భీమ్ యూత్ సభ్యులు గునపర్తి కొండలరావు,దళిత ప్రజా సమితి కాకినాడ జిల్లా అధ్యక్షులు ప్రత్తిపాడు బీఎస్పీ ప్రధాన కార్యదర్శి బత్తిన తాతాజీ,దళిత ఉద్యమ నాయకులు శికోలు నాగు,పొలుమాటి శాంతి భరత్,బత్తిన శివరాం, గునపర్తి రాఘవ,కానేటి సాల్మన్ రాజు,రాయి అనిల్, బోడపాటి చక్రవర్తి,చెవల మధు,భారీ సంఖ్యలో స్థానిక జై భీమ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

  • Related Posts

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా