మన న్యూస్ :- నిత్య ప్రయోగశిలి విలక్షణ దర్శకుడు డాక్టర్ పి సి ఆదిత్యను మరో అత్యున్నత పురస్కారం వరించింది. భువనేశ్వర్ ఒడిస్సా కు చెందిన ప్రముఖ సేవా సంస్కృతిక సంస్థ ఫేమస్ పీపుల్ ఇండియా వారు దర్శకుడు పిసి ఆదిత్యను ప్రముఖ వ్యక్తిగా గుర్తించి మహాత్మా గాంధీ స్మారక విశిష్ట వ్యక్తిగా అవార్డును ప్రకటించారు. ఈరోజు ఈ విశిష్ట పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ టిపిసిసి ప్రచార కమిటీ కో కన్వీనర్ ప్రముఖ సంఘ సేవకులు శ్రీ ఉప్పల శ్రీనివాస గుప్తా గారు ఆదిత్య సత్కరించి మహాత్మా గాంధీ స్మారక పురస్కారం అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస గుప్తా మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా సినీ రంగంలో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు రూపొందించి ఎందరో నూతన కళాకారులను ప్రోత్సహిస్తున్నటువంటి ఆదిత్య సినీ రంగానికి మరిన్ని సేవలు అందించి ఎన్నో అవార్డులు అందుకోవాలని అన్నారు. ఈ విశిష్ట పురస్కారం అందుకున్న ఆదిత్య స్పందిస్తూ నా ఆ విశ్రాంతి సినీ ప్రయాణంలో మరి కొంతమంది నూతనటీనటుల్ని సాంకేతిక నిపుణులను ప్రోత్సహిస్తానని హామీ ఇచ్చారు.