మాజీ సర్పంచ్ ల పెండింగ్ బిల్లుల ఊసేది ప్రభుత్వం చెప్పిన బిల్లుల మంజూరు హామెక్కడా
గత ప్రభుత్వ నిదుల కొరత తో సొంత డబ్బులు వెచ్ఛించిన సర్పంచ్ లకు అప్పుల తిప్పలా
కాంగ్రెస్ పాలనలో అంబేద్కర్ రాజ్యాంగం తుంగలో తొక్క మాజి సర్పంచుల ను అగౌరవపరుస్తూ ప్రజాపాలన పెరట అదికారులకు, కాంగ్రేసు నాయకులు కు అధికారం అప్పగింతా!
మనన్యూస్,గద్వాల జిల్లా:జోగులాంబ గద్వాల జిల్లా, ఉండవెల్లి మండల గ్రామ పంచాయతీ మాజి సర్పంచ్ లను ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాని ముందే SI మహేష్ ఆద్వర్యంలో ఉండవెల్లి పీస్ లో ముందోస్తు అరేస్టులు చేయడం జరిగింది.
ఈ సందర్బంగా అరెస్టైయిన సర్పంచ్ ల సంఘం నాయకులు సరవరం లోకేశ్వరెడ్డి మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు మంజూరు చేయక పోగ మమ్మల్ని ముందస్తు అరెస్ట్ లు చేయడం అన్యాయం మని వాపోవడం జరిగింది.
ప్రభుత్వం ఇన్ని సార్లు ముందస్తు అరెస్ట్ చేయడం కన్నా మేము గ్రామాన్ని అబివృద్ధి చేసిన వైనాన్ని గుర్తించి అప్పుల్లో ఉన్న మాజి సర్పంచ్ లకు ప్రత్యేక నిదులు మజూరు చేసి కాపాడాలని అవేదన వ్యక్తం చేసారు.
అరెస్ట్ సందర్భంగా సర్పంచు శేషన్ గౌడు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ ట్యాంకరు, డోజరు, డంపిగ్ యాడ్, వైకుంఠధామం, రైతువేదిక, ప్రకృతి వనం మరియు క్రీడా ప్రాగణం వంటి స్థిర ఆస్తులను గతంలో ఎన్నడు చేయని విదంగా స్థానిక సమస్యలను, రాజకీయ అబివృద్ధికి ఆటంక పరిచే నాయకులను ఎదురుకొని ముందు వచ్చేకాలానికి ఉపయోగపడే విదంగా స్థల సేకరణ చేపట్టడంలో గొంతు మీద కత్తి వున్న కష్టపడి సొంత డబ్బలు వేచించి గ్రామానికి స్థిర ఆస్తులను ఎన్నడు లేని విదంగా సమకూర్చడం జరిగింది.
గ్రామాల అబివృద్ధిలో బాగంగా శానిటేషన్, హరిత హరం, కరెంటు బిల్లులు, వీదిలైట్లు, ట్రాక్టర్ EMI ల మరియు పల్లెప్రగతి పేరట గత ప్రభుత్వం అదేశాలతో అధికారులు చేయించన పనులకు అధికారుల చుట్టూ తిరిగి ఎంబీ చేయించు కోవడం జరిగింది.
గ్రామం అబివృధ్ధి చేసిన మాకు అప్పుల తిప్పలు చేయించిన అదికారులకు పదోన్నతులు మరియు ప్రజాపాలన పేరిట చెక్ పవర్ అధికారాలు ఇచ్ఛారని ఇది రాజ్యంగ విరుద్ధం మని సర్పంచుల సంఘం నాయకులు లోకేశ్వరెడ్డి, ఈదన్న లు అందోళన వ్యక్తపరచడం జరిగింది.
ప్రభుత్వం పెండింగ్ బిల్లులు మంజూరు చేయకుండా అరెస్టులు ఇలాగే కొనసాగితే మాజీ సర్పంచులు ప్రజల మద్దతుతో ప్రభుత్వను గద్దెదించడం ఖాయమని హెచ్చరించడం జరిగింది.
ప్రభుత్వం అలసత్వం వహించక మాజీ సర్పంచులు చేసిన పనులకు పెండింగ్ బిల్లులు మంజూరు చేయవలసిందిగా సర్పంచులు డిమాండ్ చేయడం జరిగింది.