Mana News,కాకినాడ :- కాకినాడ లో దారుణం చోటు చేసుకుంది. తాజాగా కాకినాడలో పేలుడు కలకలం రేగింది. కాకినాడ బాలాజీ ఎక్సపర్టర్స్ లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఇక ఈ పేలుడులో నలుగురు వ్యక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి.హమాలీలు లోడ్ దింపుతుండగా సంభవించింది పేలుడు. భారీ శబ్దం రావడంతో పరుగులు తీశారు హమాలీలు. హైదరాబాద్ నుంచి చిన్న క్రాకర్స్ పార్శిల్ వచ్చాయి, ఆ మూటను ఒక్కసారిగా కింద పడేయడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని కాకినాడ జీ జీ హెచ్ కి తరలించారు స్థానికులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.