Mana News,Penumuru :- జీడి నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండల సాధారణ సర్వసభ్య సమావేశం ఆదివారం ఎంపీడీఓ కార్యాలయంలో జరుగుతుందని ఎంపీడీవో నీలకంఠేశ్వర రెడ్డి శనివారం సాయంత్రం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీపీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అన్ని శాఖల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ లు విధిగా హాజరుకావాలని ఆయన తెలిపారు. ఈ సమావేశం ఉదయం 10:30కు ప్రారంభమవుతుందని ఎంపీడీవో తెలియజేశారు.