మనన్యూస్,గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా సంక్రాంతి పర్వదిన సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ డా.ఆంజనేయులు గౌడ్అలంపూర్ బిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్.కిషోర్ద్వా ల గ్రంథాలయ మాజీ చైర్మన్ పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాసు హనుమంతు నాయుడు,మాజీ సింగిల్ విండో చైర్మన్ సంకాపురం రాముడు,కౌన్సిలర్ సీఎం సురేష్
సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రిమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలిసి హాజరై శ్రీ శ్రీ శ్రీ తిక్క వీరేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగినది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ఇలాంటి క్రీడా పోటీల నిర్వహణ వల్ల యువకుల మధ్య స్నేహబంధం పెరగడంతో పాటు ఆటల పట్ల పట్టుదల పెరుగుతోందని అన్నారు.గ్రామీణ ప్రాంత క్రీడలు ప్రతి ఒక్క క్రీడాకారులు చక్కటి ప్రదర్శన ఇచ్చి గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మీ ప్రదర్శనలు తీయాలని,భవిష్యత్తులో ఇలా రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగి గద్వాల ప్రాంతానికి కూడా మంచి పేరు వచ్చే విధంగా కృషి చేయాలని తెలిపారు.విద్యతో పాటు క్రీడ నైపుణ్యత పొంది క్రీడా రంగంలో కూడా రాణించాలి అని కోరారు.క్రీడల్లో గెలుపు ఓటములు సహజమే,ఓడిపోయినా నిరుత్సాహం పడకూడదు,గెలిచాము అని గర్వపడవద్దు అని అన్నారు. స్నేహపూర్వకంగా క్రీడలను ఆడి, ఓడిపోయినా ఓటమి వజయానికి నాందిగా భావించాలని పేర్కొన్నారు…. గత కేసీఆర్ ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.