మన న్యూస్ సాలూరు జనవరి11:= మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మహిళలు వేసిన రంగవల్లులు తిలకించిన మంత్రి సంధ్యారాణి , ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి సంధ్యారాణి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మెప్మా, హోం ట్రయాంగిల్ ఆధ్వర్యంలో సర్వీస్ ప్రొవైడర్స్ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి మీకు ఉన్న నైపుణ్యంతో మీ ఊరిలోనే సేవలు అందించి, చక్కటి ఆదాయాన్ని పొందటానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది అనిమంత్రి సంధ్యారాణి అన్నారు. మీకు అందించే శిక్షణకు 3000 రుసుం ప్రభుత్వమే భరిస్తుంది అని మంత్రి సంధ్యారాణి అన్నారు . మహిళలు వంటింటికే పరిమితం కాకుండా వారికి వున్న నైపుణ్యంలో శిక్షణ ఇచ్చి ఆదాయం సమకూర్చటమే కూటమి ప్రభుత్వం ధ్యేయం అని అన్నారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ,మెప్మా మరియు హోం ట్రయాంగిల్ సంయుక్త ఆధ్వర్యంలో సర్వీస్ ప్రొవైడర్స్ నమోదు కార్యక్రమం మరియు ముందస్తు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రిగుమ్మిడి సంధ్యారాణి ,ఈరోజు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మెప్మా (మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్) మరియు హోం ట్రయాంగిల్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వీస్ ప్రొవైడర్స్ నమోదు కార్యక్రమం మరియు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మెప్మా పట్టణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక స్వావలంబనకు మరియు సామాజిక సాధికారతకు కీలకంగా పనిచేస్తుందని తెలిపారు. అలాగే, హోం ట్రయాంగిల్ వంటి సేవా రంగ సంస్థలు మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి సహాయపడుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, చిన్నతరహా వ్యాపారాలను ప్రోత్సహించడం కూటమి ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలియజేశారు. గృహ సేవలు, మరమ్మతులు, మరియు ఇతర అవసరాల కోసం వృత్తిపరుల సేవలను అందించడంలో మహిళలకు మద్దతు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని మంత్రి సంధ్యారాణి తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంక్రాంతి సంబరాలు కూడా నిర్వహించబడ్డాయి. ఇందులో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సాంప్రదాయాలను ప్రదర్శించారు. సంక్రాంతి పండుగ ఉత్సాహభరిత వాతావరణాన్ని తీసుకురావడంతో పాటు, మహిళల శ్రేయస్సు కోసం నిర్వహించిన ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా నిలిచింది అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మెప్మా మరియు హోం ట్రయాంగిల్ సంస్థలు కలిసి పనిచేయడం సమాజానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంది అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నిమ్మది చిట్టి, కార్యకర్తలు పాల్గొన్నారు.