మన న్యూస్,పాచిపెంట: విశాఖ డైరీ యాజమాన్యం రైతులకు రావలసినటువంటి బోనస్ వెంటనే చెల్లించాలని తగ్గించిన పాల ధర పెంచాలని పాచిపెంట మండల కేంద్రంలో పాల రైతుల సంఘం నాయకులు తూముల అప్పన్న గంగవంశం సత్యనారాయణ దేవ్ కోట ఎర్రయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.వెంటనే బోనస్ చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని విశాఖ డైరీ యాజమాన్యం దిగి రావాలని పాల ధరలు పెంచాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా పాల రైతులకు మద్దతుగా సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ డైరీ పాలకవర్గం అత్యున్నత అధికారులు లక్షల్లో వేతనాలు తీసుకొని పాల ధరను అమాంతంగా తగ్గించి రైతులను మోసం చేయడం సరైనది కాదని బోనస్ కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం సరైన కాదని పాల డైరీ లాభాల నుంచి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతులకు బోనస్ చెల్లించాల్సి ఉండగా సక్రమంగా అమలు చేయడం లేదని దీనికి యాజమాన్యం కంపెనీ పూర్తి బాధ్యత పడి రైతులకు న్యాయం చేయాలని అన్నారు పెరిగే ధరలకు అనుగుణంగా ఎరువులు పురుగుమందులతో పాటు దానా రేట్లు పెరిగాయని దాన 75% రాయితీతో ఇవ్వాలని విశాఖ డైరీ లో జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఎంతో లాభాల్లో ఉన్నటువంటి విశాఖ డైరీ నష్టాలు చూపించి రైతులకి అన్యాయం చేయడం సరైనది కాదని ఎప్పటికైనా తగ్గించిన పాల ధరలు పెంచి రైతులకు రావలసినటువంటి బోనస్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సంబంధించినటువంటి జిల్లాస్థాయి మేనేజర్లు అధికారులు స్పందించి రైతుకు రావలసిన బోనస్ చెల్లించి విశాఖ డైరీ ని సక్రమ మార్గంలో నడిపించేందుకు కృషి చేయాలని తక్షణమే బోనస్ చెల్లించకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని తెలిపారు అనంతరం విశాఖ డైరీ పాచిపెంట మండలం డైరీ ఫార్మ్ అధ్యక్ష కార్యదర్శులకు వినతి పత్రం అందించి మేనేజ్మెంట్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారాలు చేయాలని లేదంటే ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మద్ది ఈశ్వరరావు, పార్తాపు సురేష్ ఎడ్ల గణేష్ మహంతి తౌడు తదితరులు పాల్గొన్నారు.