
టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు దేవేందర్.
మన ధ్యాస, మక్తల్:నియోజకవర్గంలోని ఉట్కూరు మండలం బిజ్వార్ గ్రామంలో సీపీఐ(ఎంఎల్ )మాస్ లైన్ పార్టీ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు తేదీ 12 ,13 సెప్టెంబర్ 2026 తేదీలలో జరుగుతున్నాయి అని సిపిఐ (ఎంఎల్ )మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి బి.రాము తెలిపారు. ఈ సందర్బంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కృష్ణ మాట్లాడుతూ, మన దేశ చరిత్రలో అత్యంత దుర్మార్గం గా ధనికులు కార్మిక వర్గాన్ని, అగ్రకులాలు నిమ్న కులాలను అణిచివేయడం లేదా సామాజికంగా వెలివేయడం జరిగిందని అన్నారు. పురుషాదిక్యఅహంకారం తో మహిళలను వివక్షత తో చూడడం ఇటువంటి చరిత్ర చాలా ఉన్నదని ఈ చరిత్రను మార్చాలని అందుకు మనమందరం సిద్ధం కావాలనీ హాజరైన కార్యకర్తలకు తెలియజేశారు .అందరూ సమానంగా ఉండే సమసమాజం, నవ సమాజం కోసం పోరాడాలని టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు,దేవేందర్ మాస్ లైన్ జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల లో పాల్గొని ప్రారంభ ఉపన్యాసం ఇచ్చి పిలుపునిచ్చారు.శనివారం శ్రామిక భవన్ లో జరిగిన పార్టీ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులలో *తత్వశాస్త్రం* అనే అంశం పై సలీం సిపిఐ (ఎంఎల్ )మాస్ లైన్ మక్తల్ డివిజన్ కార్యదర్శి బోధించగా, జిల్లా నాయకులు జయలక్ష్మి ఈ క్లాస్కు అధ్యక్షత వహించారు. మనదేశంలో ఏర్పడినటువంటి చాతుర్వర్న వ్యవస్థ పై వర్ణాలు కింది వర్ణాలపై అనేక రకాలుగా వివక్షతలు చూపుతూ సామాజికంగా వెలివేసి ఆత్మగౌరవం లేకుండా చేసాయి. రాజరిక వ్యవస్థలో రాజులు ప్రజలకు ఏమాత్రం స్వేచ్ఛ లేకుండా బానిసలుగా మార్చుకొని పరిపాలించారు. పదహారు వందల సంవత్సరంలో వ్యాపారం పేరుతో బ్రిటిష్ వాళ్లు ప్రవేశించి అన్ని రకాలుగా దోచుకున్నారు పూర్తిగా ఆర్థికంగా,మానసికంగా భారతీయులను లోబర్చుకొని దేశ సంపదను ఇంగ్లాండ్ కు తరలించి దేశాన్ని ఆర్థికంగా బలహీనపరిచారు ఇక్కడి ముడి సరుకును తీసుకెళ్లి తమ పరిశ్రమాల్లో సరుకుగా తయారు చేసిన వస్తువులను ఇక్కడ అమ్ముకొని దేశాన్ని మార్కెట్ గా మార్చారు. వారికి బానిసలుగా ఉండడానికి వారి అనుకూల విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టారు. 1947లో అధికార మార్పిడి జరిగిన తర్వాత మన దేశ పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని ఉపశమనం కలిగించే పథకాలు ప్రవేశపెట్టి, నిర్మాణాలు చేపట్టి ఇదే అభివృద్ధి అని ప్రజలను మభ్యపెట్టారు. కేవలం వాళ్ల రాజకీయ మనుగడ, ఓట్లు పొందడం కోసం అభివృద్ధి పేరుతో వివిధ రకాల పనులు చేయడం, పథకాలు ప్రవేశపెట్టడం చేశారు, అనేక రకాలుగా కుంబకోణాలు చేసి దేశ సంపదను తమ స్వంత జేబుల్లోకి మార్చుకున్నారు. అంతేకానీ నిజంగా ప్రజలను అభివృద్ధి వైపు నడిపించాలనే చిత్తశుద్ధి నాటి నుండి నేటి వరకు పాలక వర్గాల్లో ఎక్కడ కనిపిస్తలేదు అన్నాడు. నాటి కాంగ్రెస్ మోసాలను అవినీతని ఆసరాగా చేసుకొని 2014 లో అధికారం లోకి వచ్చిన మోడీ దేశ సంపదను ఆదాని అంబానీ లాంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు కారు చౌకగా అమ్మేస్తున్నాడు. దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని సామ్రాజ్యవాదైన అమెరికా ముందు తాకట్టు పెట్టాడు నిత్యం దేవుడిని మతాన్ని రాజకీయాల్లోకి లాగుతూ తన రాజకీయ అవసరాలను తీర్చుకుంటున్నాడు. మహిళలపై లైంగిక హింస జరిగిన, నిమ్న కులాలపై అగ్రవర్ణాల దాడులు జరిగిన ఎక్కడ కూడా నోరు విప్పడం లేదు. ప్రశ్నించిన వారిపై దేశద్రోహ, ఉపా కేసులు పెట్టి అనేక నిర్బంధాలకు గురి చేస్తున్నాడు. కావున నేటి ప్రజలు మతాన్ని కులాన్ని వదిలేసి పాలక వర్గాల మోసాలను అర్థం చేసుకొని సామ్రాజ్యవాద పెట్టుబడిదారులు దోచుకుంటున్నటువంటి విధానాన్ని ప్రశ్నించాలని అన్నారు. ఈ దోపిడీ విధానం లేని సమసమాజాన్ని నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏజి భుట్టో,పార్టీ జిల్లా కార్యదర్శి బి. రాము జిల్లా నాయకులు కె. కాశినాథ్, పి.రామకృష్ణ, కొండా నర్సిములు, ఛన్నారెడ్డి, కాళేశ్వర్, భగవంతు , పార్టీ డివిజన్, మండల నాయకులు ఎల్కోటి చెన్నప్ప, పి వై ఎల్ జిల్లా కార్యదర్శి సిద్దు, జీ కృష్ణయ్య,ఏఐపీకే ఎంఎస్ మండల కార్యదర్శి మల్లేష్, చిన్న బాలు, జి.గోవర్ధన్ రెడ్డికార్యకర్తలు పాల్గొన్నారు.