కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: భూమన కరుణాకర్ రెడ్డి…
జిల్లా క్రిస్టియన్ వింగ్ జనరల్ సెక్రటరీగా మల్లెమొగ్గల ఉమాపతి నియామకం…
చంద్రగిరి, సెప్టెంబర్ 11:
చంద్రగిరి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి చిత్తూరు, తిరుపతి ఉమ్మడి జిల్లాల వైయస్సార్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయా విభాగాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
కూటమి పాలనపై విమర్శలు – కార్యకర్తలకు పిలుపు..
సమావేశాన్ని ఉద్దేశించి భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని మండిపడ్డారు. ప్రజా సంక్షేమం గాలికి కొట్టుకుపోయిందని, ప్రభుత్వ వైఫల్యాలు రోజురోజుకూ స్పష్టంగా బయటపడుతున్నాయని ఆరోపించారు.
అనంతరం నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ వైయస్సార్సీపీ కార్యకర్తలు ఎక్కడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని భరోసా కల్పిస్తూ.. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, వైఫల్యాలను ప్రతీ ఇంటికీ వెళ్లి ఎండగట్టాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
క్రిస్టియన్ వింగ్ బాధ్యతలు స్వీకరించిన మల్లెమొగ్గల ఉమాపతి…
ఈ సమావేశంలో వేదికగా పార్టీలో కేసీఆర్ కంగా పనిచేస్తున్న నాయకులకు సముచిత స్థానం కలిగించారు ఇందులో భాగంగా __ మల్లె మొగ్గల ఉమాపతిని చిత్తూరు తిరుపతి జిల్లాల క్రిస్టియన్ వింగ్ జనరల్ సెక్రెటరీగా అధికారికంగా ప్రకటించారు ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు భూమాన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, రాష్ట్ర యువజన నాయకుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి సమక్షంలో స్వయంగా ఉమాపతికి గుర్తింపు కార్డును అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా మల్లె మొగ్గల ఉమాపతి మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి జిల్లా అధ్యక్షులు భూమాన కరుణాకర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు జిల్లావ్యాప్తంగా క్రిస్టియన్ కమ్యూనిటీని మరింత పటిష్టం చేసేందుకు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శాయ శక్తులూ కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. పార్టీ విజయమే ధ్యేయంగా సైనికుల పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు వివిధ మండలాల అధ్యక్షులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

