
ఆంధ్రప్రదేశ్, సెప్టెంబర్ 11, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.
ఆంధ్రప్రదేశ్లో నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు నేటి నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
ముఖ్యాంశాలు:
మరో 4 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూములపై విచారణ కొనసాగుతోంది
గత ప్రభుత్వం 22-Aలో చేర్చిన 28 లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు మంత్రి తెలిపారు. 22-A భూములకు సంబంధించి GO 444, 445 జారీ నీబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ భూమిని 22-Aలో చేరిస్తే సంబంధిత అధికారులపై చర్యలు‘మీ భూమి – బ్లాక్చెయిన్’ టెక్నాలజీ ప్రాజెక్ట్ ద్వారా భూ హక్కులకు శాశ్వత పరిష్కారం లక్ష్యం,,,GO 444 ప్రకారం జూలై 23 నుంచి ఆగస్టు 31 వరకు 22-A నుంచి భూముల తొలగింపునకు 28,790 ఎకరాలకు దరఖాస్తులు వచ్చినట్లు మంత్రి తెలిపారు. ఇందులో 1,102 ఎకరాలను ఇప్పటికే తొలగించినట్లు వెల్లడించారు.