
నెల్లూరు,సెప్టెంబర్ 09, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.

2023 సెప్టెంబర్ 9న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ,ఆయన జైలులో గడిపిన 53 రోజులకు గుర్తుగా స్థానిక నెల్లూరు జిల్లా టీడీపీ పార్టీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నెల్లూరు మేయర్, చేజర్ల సుబ్బారెడ్డి, టిడిపి రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వహ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు పాల్గొన్నారు వీరి ఆధ్వర్యంలో నిజం గెలిచింది కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 53 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి 53 దీపాలను వెలిగించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధారాలు లేకపోయినా స్కిల్ డెవలప్మెంట్ కేసు పేరుతో చంద్రబాబు ని అరెస్ట్ చేసి,కోర్టుల చుట్టూ తిప్పి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజుల పాటు ఉంచారని గుర్తుచేశారు. అయితే మధ్యంతర బెయిల్పై ఆయన విడుదలైన సమయంలో రాజమండ్రి నుంచి అమరావతి వరకు రాత్రంతా ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి మద్దతు తెలిపారని పేర్కొన్నారు.జైల్లో ఉన్న సమయంలో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రజలు చంద్రబాబు కి బాసటగా నిలిచారని తెలిపారు.హైదరాబాద్ను ఐటీ హబ్గా తీర్చిదిద్ది,మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలను తెచ్చి,ఇంజనీరింగ్ కాలేజీల ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించిన ఆయన విజన్ను గుర్తించిన ఐటీ నిపుణులు, గ్రాడ్యుయేట్లు రోడ్లపైకి వచ్చి ఆనాడు సంఘీభావం తెలిపారని వివరించారు.ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో న్యాయస్థానాలు ఈ కేసును కొట్టివేశాయని,నిజాయితీకి ఎప్పటికీ ఓటమి ఉండదని నిజం గెలిచింది అనే వాస్తవం నిరూపితమైందని వారు చాటిచెప్పారు. కేవలం కక్ష సాధింపుతోనే గత వైసీపీ ప్రభుత్వం ఈ కుట్రకు పాల్పడిందని, సెప్టెంబర్ 9 ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చీకటి రోజని మండిపడ్డారు.ఒక బలమైన ప్రజా నాయకుడిని అణగదొక్కాలని చూస్తే ప్రజలే తగిన సమాధానం ఇచ్చారని, 2024 ఎన్నికల్లో వైసీపీని కేవలం 11 స్థానాలకే పరిమితం చేసి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని తెలిపారు.నేటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగుల కోసం కేవలం 148 రోజుల్లోనే డీఎస్సీ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసి 16,430 ఉద్యోగాలు భర్తీ చేస్తే, దానిపైనా లేనిపోని రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మంత్రి నారా లోకేష్ పై తప్పుడు ఆరోపణలు చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, మరోవైపు అమరావతి, పోలవరం,విశాఖపట్నం తాగునీటి సరఫరా కాలువలు,గూగుల్ వంటి అంతర్జాతీయ పెట్టుబడుల రాకను కూడా ఓర్వలేక సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.వికసిత్ భారత్ 2047’ సంకల్పానికి అనుగుణంగా,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర 2047 దిశగా అగ్రగామిగా నిలిపేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని,చంద్రబాబు ప్రతి నిర్ణయానికి తెలుగు ప్రజలందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు,టీడీపీ పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
