రేణిగుంట సెప్టెంబర్ 4.
తిరుపతిలోని గరుడ రైల్వే గెస్ట్ హౌస్ వద్ద సౌత్ సెంట్రల్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ ల్ .వి .స్ .స్ . పాత్రుడు ( ఐ ఆర్ పి ఎస్ ఎస్ ) ని 'ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్' (ఏఐఆర్ఆర్ఎఫ్ ) ప్రతినిధుల బృందం గురువారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఏఐఆర్ఆర్ఎఫ్ కేంద్ర నిర్వాహక సభ్యులు, జోనల్ వైస్ ప్రెసిడెంట్, బ్రాంచ్ సెక్రటరీ ఆర్ .మ్ . విజయకుమార్ నేతృత్వంలో కోశాధికారి రాఘవరెడ్డి మరియు ఇతర బాధ్యులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా రిటైర్డ్ రైల్వే ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై పి సి పి ఓ ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. ముఖ్యంగా ఆన్లైన్లో రైల్వే పాస్లు పొందడం, టికెట్ రిజర్వేషన్లు చేసుకోవడంలో వయోవృద్ధులైన పెన్షనర్లు పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆన్లైన్ విధానంతో పాటు పెన్షనర్లకు భౌతికంగా (ఫిసికల్ ) కూడా పాస్లు మంజూరు చేసేలా సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పెన్షనర్ల అసోసియేషన్ కార్యకలాపాల నిర్వహణకు కార్యాలయ (ఆఫీస్) సౌకర్యం కల్పించాలని కోరారు.
ఈ వినతులపై ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ ల్ .వి .స్ .స్ . పాత్రుడు .సానుకూలంగా స్పందించారు. పాస్ల అంశంపై రైల్వే బోర్డుతో మాట్లాడి పెన్షనర్లకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన పి సి పి ఓ ఏఐఆర్ఆర్ఎఫ్ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఐఆర్ఆర్ఎఫ్ ఉపాధ్యక్షులు రమణరాజు, లతీఫ్, సూర్యప్రకాష్, సుబ్బరాజు, రామకృష్ణయ్య, సంజయ్ శేఖర్, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.

