
మన ధ్యాస, నెల్లూరు, ఆగస్టు 29 : నెల్లూరు నగరం, స్థానిక జేమ్స్ గార్డెన్ నందు నూతనంగా ప్రారంభమైన సాయి శ్వాస స్పెషాలిటీ హాస్పిటల్ ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ ఎన్ సునీల్ కుమార్ ఎంబిబిఎస్. డిటిసిడి. డి ఎన్ బి మరియు డాక్టర్ జి. భావన ఎంబిబిఎస్ ఎండి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు ఇతర నాయకులకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ....శ్వాసకోసవ్యాధులకు మన నెల్లూరు నందు సాయి శ్వాస స్పెషాలిటీ హాస్పిటల్ను అత్యధిక పరికరాలతో చెన్నై వంటి నగరాలకు దీటుగా సాయిశ్వాస స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఎటువంటి శ్వాసకోశ వ్యాధులకు అయినా చెన్నై వంటి నగరాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా మన నెల్లూరు నందు డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అత్యుత్తమ చికిత్సను అందిస్తున్నారని, అదేవిధంగా అన్ని రకాల వ్యాధులకు డాక్టర్ జి. భావన ఆధ్వర్యంలో చికిత్సలు అందిస్తున్నారని, 24 గంటలు సాయి శ్వాస స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్లు అందుబాటులో ఉంటారని, అంబులెన్స్ సౌకర్యం మరియు అత్యుత్తమ నర్సింగ్ స్టాప్ తో రోగులను ప్రేమతో చూసుకునే నర్సింగ్ స్టాఫ్ అందుబాటులో ఉంటారని తెలిపారు, హాస్పిటల్ ప్రారంభోత్సవ సందర్భంగా సెప్టెంబర్ ఒకటో తారీకు నుండి ఏడో తారీఖు వరకు స్కిన్ అలర్జీ టెస్ట్ ను సాయి శ్వాస హాస్పిటల్ నందు ఉచితంగా అందిస్తున్నామని కావున మనసింహపురి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనిడాక్టర్ సునీల్ కుమార్ కోరారు. అందరికీ అందుబాటు ధరలలోమంచి వైద్యాన్ని అందించాలని మంచి ఉద్దేశంతో ఏ హాస్పిటలనుస్థాపించడం జరిగిందని కావున సింహపురి ప్రజలు మీ శ్వాస కోసవ్యాధులకు మరియు ఇతర ఏ రకమైన వ్యాధులకైన మన సాయి శ్వాస హాస్పిటల్ నందు అత్యుత్తమ సేవలను అందిస్తున్నామని తెలియజేశారు. సాయి శ్వాస స్పెషాలిటీ హాస్పిటల్ నూతన ప్రారంభోత్సవానికివిచ్చేసిన ప్రతి ఒక్కరికి హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ ఎన్. సునీల్ కుమార్ డాక్టర్ జి. భావన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.



