
మన ధ్యాస, నిజాంసాగర్ ,బిచ్కుంద, ఆగస్టు 16: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె జొనిట–దాస్ వివాహ విందు కార్యక్రమం బిచ్కుందలోని డీబీఎల్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులు జొనిట–దాస్ లను ఆశీర్వదించారు.ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వివాహ విందు కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుటుంబ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.అనంతరం వధూవరులను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి,వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించారు. సీఎం రేవంత్రెడ్డి హాజరుకావడంతో బిచ్కుందలో జరిగిన జొనిట–దాస్ వివాహ విందు వేడుకకు ప్రత్యేక శోభ చేకూరింది.
కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ,జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ,డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,తదితరులు ఉన్నారు
