తిరుపతి ఆగస్టు14: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆధ్వర్యంలో రేపు (ఆగస్టు 15) తిరుపతి పోలీస్ మైదానంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి ఈరోజు రిహార్సల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ రిహార్సల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., హాజరై వేడుకల ఏర్పాట్లు, పరేడ్ నిర్వహణ, భద్రతా చర్యలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ముందుగా పరేడ్ కమాండర్ ద్వారా జిల్లా ఎస్పీ కి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పరేడ్ బృందాల కవాతును జిల్లా ఎస్పీ పరిశీలించారు. వేడుకల్లో పాల్గొనే పోలీస్ సిబ్బంది కవాతు, క్రమశిక్షణ, సమన్వయం, భద్రతా ఏర్పాట్లు, వేదిక నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా *ఎస్పీ మాట్లాడుతూ, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్న పోలీస్ అధికారులు, సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్లు, ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. గత కొంతకాలంగా వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, వాటిని పకడ్బందీగా మరియు సమర్థవంతంగా నిర్వహిస్తున్న అధికారులను అభినందించారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జిల్లా పోలీస్ శాఖ క్రమశిక్షణ, సమన్వయం, అంకితభావాన్ని ప్రతిబింబించేలా ఎలాంటి లోపాలకు తావులేకుండా అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. రేపటి వేడుకల్లో రిహార్సల్లో చూపిన క్రమశిక్షణ, సమన్వయం, అంకితభావాన్ని కొనసాగిస్తూ విధులు నిర్వహించి తిరుపతి జిల్లా పోలీస్ శాఖకు మరింత మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీనివాసులు (పరిపాలన), రవి మనోహరాచారి (శాంతిభద్రతలు), శ్రీనివాసరావు (సాయుధ), డీఎస్పీలు, సీఐలు, ఆర్ఐలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


