రేణిగుంట ఆగష్టు 7.
తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని రైల్వే ఇన్స్టిట్యూట్ గ్రౌండ్లో సౌత్ ఇండియన్ 7/6 ఫుట్బాల్ టోర్నమెంట్ అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమైంది. కె. మునిరత్నం బాబు, డాక్టర్ సుధాకర్, దేవాదానం, రెడ్డెప్ప (తిరుపతి), విజయ్ కుమార్ దుగ్గుల ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు.
ఈ టోర్నమెంట్కు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మిధున్ శాలి మరియు రైల్వే ఐపీఎఫ్ జనార్ధన్ చేతుల మీదుగా ఫుట్బాల్ పోటీలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు జరిగిన మ్యాచ్లలో తిరుపతి, రేణిగుంట, నగరి, తిరువళ్లూర్ మరియు పుత్తూరు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధి జట్లు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నాయి.
అలాగే, రేపు జరగబోయే మ్యాచ్లలో రాజమండ్రి, వేలూరు, చీరాల, అరక్కోణం మరియు మదనపల్లె జట్లు తలపడనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ క్రీడా ప్రాంగణంలో మ్యాచ్లు సజావుగా సాగడానికి మరియు ఈ టోర్నీ విజయం కోసం సహకరించిన సోదరుడు రాజేష్ (సోమియల్, తిరుపతి)కి, అలాగే పాల్గొన్న తిరుపతి ప్లేయర్స్ అందరికీ నిర్వాహక కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది.


