
కలిగిరి, ఆగస్టు 07, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె

నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని వీరారెడ్డి పాలెం ఎస్సీ కాలనీ శ్రీ మాత పరమేశ్వరి అమ్మవారి గుడిలో దొంగలు పడ్డారు. గ్రామస్తులు సమాచారం మేరకు వీరారెడ్డి పాలెం లో శ్రీ మాత పరమేశ్వరి తల్లి గుడిలో బుధవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు గుడి లోని ఉంచిన హుండీ ను దూరంగా తీసుకెళ్లి ఆ ఉండి ని పగలగొట్టి అందులోనే కానుకలను తీసుకెళ్లార ఆ గ్రామస్తులు. గుడి కమిటీ సభ్యులు తెలిపేరు. అర్ధరాత్రి వేళ దొంగల పడి అక్కడ ఉన్న ఉండి తీసుకెళ్లి కొంచెo దూరం లోనే పగలగొట్టారు అందులో ఉన్న సుమారు 50000 రూపాయల వరకు కానుకలు తీసుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. వెంటనే పోలీసులు కు సమాచారం అందించిన గ్రామస్తులు సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.
