రేణిగుంట ఆగష్టు 2.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
ఈ నేపథ్యంలో తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని దామినేడు ప్రాంతంలో సీఐ మరియు పోలీసు సిబ్బంది ర్యాపిడ్ డ్రగ్ (క్యానబినాయిడ్స్) పరీక్షలు నిర్వహించారు. అనుమానితులపై పరీక్షలు నిర్వహించి, మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు నిరంతర తనిఖీలు కొనసాగిస్తున్నారు.
అదే విధంగా పిచ్చాటూరు ప్రాంతంలో మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, మహిళలపై జరిగే నేరాల నివారణ, మహిళల భద్రత, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పోలీసులు వివరించారు.
అలాగే నాయుడుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మనేకూరు ఎన్టీఆర్ కాలనీలో వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన 14 మంది కార్మికులకు ర్యాపిడ్ డ్రగ్ (క్యానబినాయిడ్స్) పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నాయుడుపేట ఎస్ఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., మాట్లాడుతూ, మాదకద్రవ్యాల నిర్మూలనకు జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. డ్రగ్స్ వినియోగం, విక్రయం లేదా రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని కోరారు. డ్రగ్స్ రహిత తిరుపతి జిల్లాను నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు.

