
కలిగిరి, జూలై 24, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

కలిగిరి మండలం పెద్దపాడు గ్రామం లో ఎంపీపీ పాఠశాలలో మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ 4.0 కార్యక్రమం స్కూల్ హెడ్మాస్టర్ ఎం శైలజ, స్కూల్ చైర్మన్ తలపల మౌనిక, ఆధ్వర్యంలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు రైతు కార్య నిర్వాహక కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు,విశ్రాంత ఉపాధ్యాయులు ఎండ్లూరి రమణయ్య, పెద్ద కొండూరు మాజీ సర్పంచ్ మొక్క హాజరత్ రావు లు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులకు నోటు పుస్తకాలు పలకలు వాటర్ బాటిళ్లు వారు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, నాణ్యమైన యూనిఫార్ములు, స్కూల్ బ్యాగులు, షూస్, పాఠ్యపుస్తకాలు, పోషకాహారాన్ని ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తోందని పేర్కొన్నారు.అలాగే 'తల్లికి వందనం' పథకం ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కుటుంబంలో ఉన్న ప్రతి అర్హ విద్యార్థికి ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని జమ చేస్తోందని తెలిపారు. ఈ అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని పిల్లలను బాగా చదివించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని, విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది సోషల్ వెల్ఫేర్ ఎం సునీత, విద్యార్థినులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
